Wednesday, 19 December 2018

The Process of Creation according to Manusmriti


आसीदिदं तमोभूतम् अप्रज्ञातमलक्षणम्।
अप्रतर्क्यमविज्ञेयं प्रसुप्तमिव सर्वतः।। (1.5)

What was there before the Creation?
तमोभूतम् – Thick Darkness -
How was it?
·         अप्रज्ञातम् इवAs if It could not be perceived
·         अलक्षणम् इव – As if It could not be identified
·         अप्रतर्क्यम् इव – As if It could not be imagined 
·         अविज्ञेयम् इव – As if It could not be understood 
·         सर्वतः प्रसुप्तम् इव – As if It was resting everywhere

ततः स्वयम्भूर्भगवान् अव्यक्तो व्यञ्जयन्निदम्।
महाभूतादिवृत्तौजाः प्रादुरासीत् तमोनुदः।। (1.6)
योसावतीन्द्रियग्राह्यः सूक्ष्मोव्यक्तस्सनातनः।
सर्वभूतमयोचिन्त्यः एव स्वयमुद्बभौ।। (1.7)

Then?
भगवान् emerged.
Who is called भगवान्?
ऐश्वर्यस्य समग्रस्य वीर्यस्य यशसः श्रियः।
ज्ञानवैराग्ययोश्चैव षण्णां भग इतीरणा।।
One Who possesses the following six is भगवान्!
1)      ऐश्वर्यम्Lordship
2)      वीर्यम्Capability
3)      यशःGlory
4)      श्रीःWealth
5)      ज्ञानम्Knowledge
6)      वैराग्यम्Detachment
How did भगवान् emerge?
स्वयम्भूः / स्वयम् उद्बभौHe emerged by himself
इदं महाभूतादि व्यञ्जयन्He emerged by manifesting    the creation
How was/is he?
अव्यक्तःNon-elucidated (Having no limbs)
वृत्तौजाःUndeniably vivid
तमोनुदःDestroyer of the darkness
अतीन्द्रियग्राह्यःPerceivable by super-sense
सूक्ष्मःInfinitesimal
सनातनः Eternal
सर्वभूतमयःPresent in / Possessor of all the creatures  
अचिन्त्यःUnimaginable

सोभिध्याय शरीरात् स्वात् सिसृक्षुर्विविधाः प्रजाः।
अप एव ससर्जादौ तासु बीजमवासृजत्।। (1.8)

भगवान् meditated and wished to create various creatures from his own body.  At the earliest, he created water (base) and then created a seed in it.
The seed became a golden egg.  Then, Brahma, the grandfather of all the worlds, by himself was born in it.  He separated the egg into two parts.  He made Heaven and Earth with those two parts.  He made Sky, eight directions and the place for water between those two parts.
Then, Brahma had taken Manas and Ahankara. 
Then, he made Mahat, Trigunas (Sattva Rajas Tamas), Sense organs and Motor organs.
Then, he made Five Bhutas (Ether, Air, Fire, Water, and Earth), their Tanmatras (Sound, Touch, Colour, Taste, and Smell) along with Six Vikaras

01
जायते
Emerging
02
अस्ति
Being
03
विपरिणमते
Changing
04
वर्धते
Developing
05
उपक्षीयते
Decaying
06
नश्यति
Expiring

Then, he made various Living creatures.

कालं कालविभक्तीश्च नक्षत्राणि ग्रहांस्तथा।
सरितस्सागरान् शैलान् समानि विषमाणि च।। (1.24)
Gradually, Brahma created Time and its divisions (Like Days, Months, Years, Seasons etc.), Stars, Planets, Rivers, Oceans, Mountains, Plains and Plateaus. 

 तपो वाचं रतिं चैव कामं क्रोधमेव च।
सृष्टिं ससर्ज चैवेमां स्रष्टुमिच्छन्निमाः प्रजाः।। (1.25)
Then, with a desire to create the people, he created Penance, Speech, Interest, Desire and Anger.

कर्मणां च विवेकार्थं धर्माधर्मौ व्यवेचयत्।
द्वन्द्वैरयोजयच्चेमाः सुखदुःखादिभिः प्रजाः।। (1.26)
He created Dharma and Adharma to distinguish Good and Bad actions.  He added opposite duals to the humans.

Opposite Duals
Happiness × Sadness
Love  × Hatred
Victory × Defeat
Profit × Loss
Heat × Cold

यं तु कर्मणि यस्मिन् स न्ययुङ्क्त प्रथमं प्रभुः।
स तदेव स्वयं भेजे सृज्यमानः पुनः पुनः।। (1.28)
Whatever action that was assigned to a creature in the beginning, it stuck to the same action, being created again and again in every fresh creation after pralaya.  
हिंस्राहिंस्रे मृदुक्रूरे धर्माधर्मानृतानृते।
यद्यस्य सोधात्सर्गे तत्तस्य स्वयमाविशत्।। (1.29)
Whatever kind of features that were assigned to a group of creatures at the time of creation, it attained the same features, without fail.

हिंस्राहिंस्रे
A Lion is Merciless
A Deer is Demure
मृदुक्रूरे
A Brahmin is Compassionate
A Conqueror is Cruel
धर्माधर्मौ
Serving Parents is Dharma
Troubling neighbours is Adharma
नृतानृते
Gods speak Truth
Humans do speak Untruth

यथर्तुलिङ्गान्यृतवः स्वयमेवर्तुपर्यये।
स्वानि स्वान्यभिपद्यन्ते तथा कर्माणि देहिनः।। (1.30)
Various Seasons automatically get their features by themselves.  Similarly, even these various living creatures get their features appropriate for them. 

लोकानां तु विवृद्ध्यर्थं मुखबाहूरुपादतः।
ब्राह्मणं क्षत्रियं वैश्यं शूद्रं च निरवर्तयत्।।  (1.31)
For the development of the world, he dispensed Brahmin, Kshatriya, Vaisya and Sudra from his Face, Hands, Thighs and Feet respectively.
द्विधा कृत्वात्वमनो देहमर्धेन पुरुषोभवत्।
अर्धेन नारी तस्यां स विराजमसृजत्प्रभुः।। (1.32)
Having separated his body into two parts, he became Man with a half of it and became a Woman with the second half.  He created “Virat Purusha” from the Woman.

01
Then, Viratpurusha created Manu
02
Manu Created 10 Prajapatis:

01
मरीचिः
02
अत्रिः
03
अङ्गिराः
04
पुलस्त्यः
05
पुलहः
06
क्रतुः
07
प्रचेतसः
08
वसिष्ठः
09
भृगुः
10
नारदः

 
मरीचिमत्र्यङ्गिरसौ पुलस्त्यं पुलहं क्रतुम्।
प्रचेतसं वसिष्ठं च भृगुं नारदमेव च।।
एते मनूंस्तु सप्तान्यसृजन् भूरितेजसः।
देवान् देवनिवासांश्च महर्षींश्चामितौजसः।।
यक्षरक्षः पिशाचांश्च गन्धर्वाप्सरसोसुरान्।
नागान् सर्पान्सुपर्णांश्च पितणां च पृथग्गणान्।।
विद्युतोशनिमेघांश्च रोहितेन्द्रधनूंषि च।
उल्कानिर्घातकेतूंश्च ज्योतींष्युच्चावचानि च।।
किन्नरान्वानरान्मत्स्यान् विविधांश्च विहङ्गमान्।
पशून्मृगान्मनुष्यांश्च व्यालांश्चोभयतोदतः।।
क्रिमिकीटकपतङ्गाश्च यूकामक्षिकमत्कुणम्।
सर्वं च दंशमशकं स्थावरं च पृथग्विधम्।। (1.35 -1.40)

The following were created by Prajapatis:

01
सप्त मनवः
7 Manus such as Svayambhuva
02
देवाः
Gods
03
देवनिवासाः
Residences of Gods
04
महर्षयः
Great Sages
05
यक्षाः
Yakshas such as Kubera
06
रक्षाः
Rakshasas such as Ravana
07
पिशाचाः
Pisachas
08
गन्धर्वाः
Gandharvas such as Chitraratha
09
अप्सरसः
Apsaras such as Rambha
10
असुराः
Asuras such as Virochana
11
नागाः
Nagas such as Vasuki
12
सर्पाः
Sarpas
13
सुपर्णाः
Suparnas such as Garuda
14
पितृदेवताः
Pitr.Devatas
15
विद्युतः
Lightenings
16
अशनयः
Thunderbolts
17
मेघाः
Clouds
18
रोहितः
Colourful Lights (Aurora Borealis)
19
इन्द्रधनूंषि
Rainbows
20
उल्काः
Meteors
21
निर्घातकेतवः
Big Sounds, Comets such as Haley
22
ज्योतींषि
Bright stars and planets
23
किन्नराः
Kinnaras (Gods with Horse faces)
24
वानराः
Vanaras (Resemble Humans)
25
मत्स्याः
Fishes such as Rohitas
26
विहङ्गमाः
Birds
27
पशवः
Animals such as Cow
28
मृगाः
Animals such as Deer
29
मनुष्याः
Humans
30
व्यालाः
Meat-eating Animals such as Lion
31
उभयतोदतः
Animals having teeth in both upper and lower jaws
32
क्रिमिकीटकपतङ्गाः
Various insects
33
यूकामक्षिकमत्कुणाः
Hair bugs, Flies and Bedbugs etc.
34
दंशमशकाः
Biting creatures such as Mosquitoes
35
स्थावराः
Trees and Mountains etc.

पशवश्च मृगाश्चैव व्यालाश्चोभयतोदतः।
रक्षांसि च पिशाचाश्च मनुष्याश्च जरायुजाः।।
अण्डजाः पक्षिणस्सर्पा नक्रा मत्स्याश्च कच्छपाः।
यानि चैवंप्रकाराणि स्थलजाद्यौदकानि च।।
स्वेदजं दंशमशकं यूकामक्षिकमत्कुणम्।
ऊष्मणश्चोपजायन्ते यच्चान्यत्किञ्चिदीदृशम्।। (1.43 – 1.46)
उद्भिज्जास्स्थावरास्सर्वे बीजकाण्डप्ररोहिणः।

जरायुजाः
पशवः, मृगाः व्यालाः उभयतोदतः, रक्षांसि, पिशाचाः, मनुष्याः
अण्डजाः
स्थलजाः
औदकाः
पक्षिणः, सर्पाः, नक्राः, कच्छपाः
मत्स्याः सर्पाः, नक्राः, कच्छपाः
स्वेदजाः
दंशाः, मशकाः, यूकाः, मक्षिकाः, मत्कुणाः
उद्भिज्जाः
स्थावराः सर्वे
बीजप्ररोहिणः, काण्डप्ररोहिणः

ओषध्यः फलपाकान्ता बहुपुष्पफलोपगाः।।
अपुष्पाः फलवन्तो ये ते वनस्पतयः स्मृताः।
पुष्पिणः फलिनश्चैव वृक्षांस्तूभयतः स्मृताः।।

ओषध्यः
Oshadhi
फलपाकान्ताः बहुपुष्पफलोपगाः
Their life span ends when they yield fruit.
Many flowers and Many fruit in a single bunch. – Rice etc.
वनस्पतयः
Vanaspati
अपुष्पाः फलवन्तः
They yield fruit without flowers – Jackfruit etc.
वृक्षाः
Trees
पुष्पिणः फलिनः
They yield fruit after flowering – Mango etc.

गुच्छगुल्मं तु विविधं तथैव तृणजातयः।
बीजकाण्डरुहाण्येव प्रतानावल्ल्य एव च।।
तमसा बहुरूपेण वेष्टिताः कर्महेतुना।
अन्तस्सञ्ज्ञा भवन्त्येते सुखदुःखसमन्विताः।।
एतदन्तास्तु गतयो ब्रह्माद्यास्समुदाहृताः।
घोरेस्मिन् भूतसंसारे नित्यं सततयायिनि।। (1.46 – 1.50)

गुच्छम्
Branches that directly grow from root
Jasmine etc.
गुल्मम्
Single Plant that grows from many roots
Bamboo etc.
तृणम्
Plants similar to Gulma but grow very short
Darbha etc.


प्रतानम्
Fruits of these plants do consist fibres
Gourd etc.
वल्ली
Creepers and Climbers
Pumpkin etc.


Tuesday, 18 December 2018

శెట్టూరు వారిదప్ప కథ

ఎర్రనేల చేను. అక్కడ బలిష్ఠులైన వస్తాదుల్లాంటి మనుషులు గునపాలు, పారలు, తట్టలు ముందేసుకుని కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో వారిదప్ప దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే అతని భార్య దిగులుగా కూర్చుంది. వారి బిడ్డ వారిద్దరి మధ్య దిగులుగా కూర్చుంది.
ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ నిశ్శబ్దంగా మౌనవ్రతం పాటిస్తున్నట్టు ఉన్నారు. ఏమైంది? వారికేమైంది? జరిగిన విషయం తెలుసుకుంటే గాని, వారి అయోమయపు అవస్థ ఏమిటో అర్థం కాదు. పదండి తెలుసుకుందాం.
<><><>

వేసవి కాలం. చిటపటలాడిస్తున్న ఎండ. వేడిగా వీస్తున్న గాలి. క్రింద ఎర్రనేలపై కణకణలాడుతున్న చిన్నా పెద్దా రాళ్లు. నెత్తి మీద ఒక నీళ్ల కడవను మోస్తూ ఆ రాళ్లమీద ఒక స్త్రీ జాగ్రత్తగా నడుచుకుని వస్తోంది. ఆమె ప్రక్కనే ఒక పదేండ్ల పిల్ల కూడా చిన్నపాటి మరో కడవలో నీళ్లు మోసుకొస్తోంది.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. "మాట్లాడితే అందుకు వొంట్లో ఉన్న కొంత శక్తి ఖర్చు అవుతుందేమో, దానిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి" అన్న పట్టుదలతో ఉన్నట్లు నిశ్శబ్దంగా నెమ్మదిగా నడుస్తున్నారు.



అప్పుడప్పుడు ఆ పిల్ల, "అమ్మా! మోసి మోసి తలకాయ నస్తా వుంది" అంటే కాసేపు ఆగి, బరువు దించుకుని మరలా తలల మీదికి ఎత్తుకొని బయలుదేరుతున్నారు. పాపం, ఓ చెట్టు క్రింద నీడలోనైనా ఆగుదామంటే, చుట్టుపక్కల అక్కడక్కడ చిన్న చిన్న పొదలే తప్ప, చెట్లే లేవాయెను!
ఇంతలో ఉన్నట్టుండి రాళ్లకు తట్లుకొని ఆ పిల్ల ముందుకు తూలి పడినంత పని అయింది. "ఇట్లైతే దెబ్బలు తగులుతాయి పాపయ్యా, నీకేమన్నా అయితేగిన మీ యప్పకి పానం బోతాది. యాడన్నా ఉన్నీలే, ఆ నీళ్లు పారబోసి ఉత్త కడవ మోసుకురా. నాతానుండే నీళ్లు సాలు" అంది ఆమె.
"లేదమ్మా! ఈట్నుంచి సక్కగా నడుస్తాలే" అంది ఆ పిల్ల.
తల్లి కంట్లో చిన్న నీటి తెర పరచుకుంది. అట్లే తుడుచుకుని ముందుకు నడిచింది. ఆ పిల్ల అనుసరించింది.
ఇంతలో వారికి దూరం నుండి గుఱ్ఱాల డెక్కల చప్పుడు వినిపించింది. ఇద్దరూ ఒక్క క్షణం ఆగి ఆ వైపు చూశారు. ఇద్దరు రౌతులు తమవైపే వస్తూ ఉండటం కనిపించింది.
"ఎవరమ్మా వారు?"
"ఏమో పాపయ్యా!"
వారు చూస్తూ ఉండగానే ఆ రౌతులు వారి వద్దకు వచ్చారు. వారి దగ్గర ఉన్న కత్తులను చూసేసరికి తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసింది. కానీ వారు మాత్రం వీరి భయాన్ని పోగొట్టేందుకన్నట్టు చిరునవ్వు నవ్వారు. వారి ముఖాలు సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసినంతసేపు పట్టలేదు, ఆ భయం పోవడానికి.
"ఎవరమ్మా మీరు? పాపం చాలా దూరం నుండి నీళ్లు మోసుకువస్తున్నట్టున్నారు?" అన్నాడు వారిద్దరిలో ఒకాయన.
"అవును అన్నా, కరువు కాలం కదా, వానలు పడక మూడేండ్లాయె. పంటల్లేక జనమంతా మా వూరిడిసి పాయిరి. మా చేనితాన నీళ్లు లేవు. వీళ్ళయ్య ఆడ బాయి తోగుతాండాడు. ఆయప్పకి నీళ్లు కొండబోతాండాము."
"బాయి తోగుతాండారా? ఆడ నీళ్లు పడకోకుంటే ఏమి జేస్తారు మడి?" అన్నాడు రెండో ఆయన.
"పడతాయి అన్నా, వీళ్ళయ్యకి నీళ్ల శాస్త్రుము తెలుసు. ఆరు మొట్లులో నీళ్లు పడతాయన్న్యాడు."
"నీళ్ల శాస్త్రం తెలుసునా?" అన్నాడు మొదటి ఆయన. "అయితే నీళ్లు పడతాయా మరి?" అని అడిగాడు చిరునవ్వుతో.
"ఊ, పడతాయి!" అన్నది ఆ చిన్న పిల్ల కళ్ళలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.
"సరే పదప్పా, ఆ వింత ఏమిటో చూద్దాము మనం కూడా" అన్నాడు మొదటి ఆయన.
***

తన భార్యాబిడ్డలు పరిచయం చేయగా వారిదప్ప తవ్వకం పని కాసేపు ఆపి, ఆ ఆగంతుకులకు స్వాగతం పలికాడు. వారిదప్ప భార్య పరచిన తుంగ చాప మీద ఎండలోనే కూర్చున్నారు వారిద్దరూ.
"ఏమప్పా, నీకు నీళ్ల శాస్త్రం తెలుసునంట కదా! మడి మూడేండ్లనుండి కరువుంటే ముందరే బాయి తోక్కొని ఏంటికి సేజ్జెం సేసుకోకుపోతివి?"
"ఈ సేన్లోనే గాని, ఈ సగాల్లో యేడ్యాడా నీళ్లు లేవు పెద్దయ్యా!
అబుడు ఈ సేనేమో మాది గాకపాయె. ఆటికీ ఈ సేనాయప్పకి సెప్పితి, ఇట్ల ఊరందురుమూ గలిసి ఈ సేన్లాన వొగ బాయి తోక్కొందామప్పా, ఊర్లా సేన్లన్నిటికీ సరిపోయినన్ని నీళ్ళుండాయీడ అని. సెప్పి సెప్పి సాలైపాయ గాని ఈ సేనాయప్ప యినకపాయ, ఊర్లా జనాలు కూడా యినకపాయిరి. అందరూ ఈ మూడేండ్లలో ఊరిడిసి పాయిరి. ఈ సేనాయప్ప పోతా పోతా నాకు ఈ సేను అమ్మిడిసి పాయ. ఇంక నేనొగుణ్ణ్యే ఈడ మిగిలినాను. దానికే, నేనొగుడే బాయి తోగుతుండాను. నీళ్లు బడినంక ఊరిడిసి పోయినోళ్ళందర్నీ మళ్ళీ రమ్మనల్ల. మళ్ళీ మా వూరు మనుషులతో కలకలలాడల్ల!" అన్నాడు వారిదప్ప.
"సరేనప్పా, బాయి తోగుతావు, సరే, కానీ, వానలు రాకుంటే రానురాను ఈ బాయి కూడా యెండిపోదా? అప్పుడేమి సేసేకుంది మడి?"
"పెద్దయ్యా! నిజమే! వానలు రాకుంటే ఎంత పెద్ద బాయిలయినా ఎండిపోతాయి. దానికే మడి, బాగా సెట్లు పెంచల్ల. సెట్లు బాగుండేతలికే వానలు బాగొస్తాయి. నీళ్ళుండేతప్పుడే సెట్లు నాటుకొని వాటిని బాగా సాకల్ల! బాతు ఉంటే గుడ్డు వస్తుంది. గుడ్డు ఉంటే బాతు వస్తుంది. బాతును సంపితే గుడ్డు రాదు, గుడ్డు లేకుంటే బాతూ పుట్టదు. అట్లే, సెట్లుంటే వానలు వస్తాయి, వానలు ఉంటే సెట్లు ఉంటాయి. మా జనాలందరూ శానా తిక్కోళ్లు. సెట్లూ గుట్టలూ కొడతాంటారు. గుట్టలు కొడితే సేజ్జం భూమి ఎక్కువైతాది అనుకుంటారు. సెట్ల నీడ పడితే పంట సరిగా రాదని సెట్లు కొడతారు. ఇట్లా ఊర్లా ఉండే సెట్లూ గుట్టలూ కొట్టి కొట్టి వానలు లేకుండా సేసుకొని, ఇబుడిట్లా ఊరిడిసిపాయిరి సుడి!"
"ఊరికే నీళ్ల శాస్త్రమంటివి, నువు సూస్తే వానలశాస్త్రము కూడా సదివినట్లుండావే వారిదప్పా?"
"వానల శాస్త్రం కాదులే పెద్దయ్యా, ఏదో వానాకాలం చదువుల శాస్త్రం" అన్నాడు వారిదప్ప సిగ్గుపడుతూ.
"సరేనప్పా, ఆరు మొట్ల బాయంటే నువ్వొగుడే తోగేకి యెబుడయ్యీని? అంతకాలుము నీ భార్య, నీ బిడ్డ యిట్ల ఎంతదూరమునుండి నీళ్లు బువ్వ మోసుకురావల్ల?"
"నాదేముందిలే పెద్దయ్యా, గుంత తోగేదొకటే పని. కానీ, వీళ్లదే పాపుము అసలైన కష్టుము" అన్నాడు వారిదప్ప మొగం సన్నది జేసుకొని.
"మా కష్టుము ఏమిలే అన్నా, నీళ్లు మోసుకొచ్చేది మాకు కొత్తపనేమీ గాదు. ఈయప్పే, ఎర్రటి ఎండలో మాడుకుంటా తోగేది సూస్తుంటే మాకు యేమేమో ఐతాది" అన్నది వారిదప్ప భార్య కన్నీళ్లు పెట్టుకుంటా.
"రైతన్నెంక యెండలో బొతుకు జేయక నీడలో గూకుని ఉత్తుత్త మాటల్తో పొద్దుబుచ్చే వాడనుకుంటివా?" అంటూ వారిదప్ప గట్టిగా నవ్వేశాడు. "ఈయమ్మ మాటలకేమిలే పెద్దయ్యా, మంచి ఆకలి పొద్దుకొచ్చినారు. మీరు గూడా రొవంత బువ్వ తినిపొండి." అన్నాడు.
ఆ ఆగంతుకులు సంతోషంగా అందుకు అంగీకరించి, ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారు. వారు వెళ్ళబోతూ ఇవ్వబోయిన డబ్బును ఆ దంపతులు వద్దంటే వద్దన్నారు. దాంతో మొదటి ఆయన తన మెడలో నున్న ఒక ఖరీదైన ముత్యాలహారాన్ని తీసి వారి కూతురి మెడలో వేశాడు.
"అయ్యో, వద్దన్నా" అని వారిదప్ప భార్య అంటే, "తల్లీ, నువ్వు నన్ను నోరారా అన్నా అన్నావు. మరి ఈ హారం మేనమామ తన మేనకోడలికి ఇచ్చిన కానుక అనుకో" అన్నాడు ఆయన చిరునవ్వుతో.
***

ఆ మరుసటి రోజు పొద్దునే వారిదప్ప, ఆయన భార్యాబిడ్డలు చేనులో తాము బావి తవ్వుతున్న స్థలానికి వచ్చేసరికి అక్కడ చాలామంది మనుషులు బావిని తవ్వే పనిముట్లతో సిద్ధంగా కనిపించారు.
"యెవురయ్యా మీరందరూ? యేమిటికి ఇట్లొచ్చినారు?" అన్నాడు వారిదప్ప వారిని ఆశ్చర్యంగా చూస్తూ.
"సామీ, తిమ్మరాయ ప్రభువులు మీరు ఎట్లా చెబితే అట్లా, ఎంత లోతుకంటే అంత లోతుకు మీ సేనులో బాయి తోగి రమ్మని పంపిచ్చినారు" అన్నాడు ఆ మనుషుల నాయకుడు.
తిమ్మరాయప్రభువంటే కళ్యాణదుర్గం ప్రభువు. వారిదప్ప ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
"ఆయప్పకి తాను బాయి తోగుతున్నట్ల ఎట్లా తెలిసింది? తెలిసినా గాని, ఇట్లా మనుషులను పంపిచ్చే అవసరము ఆయప్పకేముంది? ఇంత మంది మనుషులు తనకి సాయం జేస్తే బాగానే ఉంటుంది కానీ, కరువు కాలంలో నీళ్లు పడేదంకన్నా ఇంతమందిని బువ్వ బెట్టి సాకి, నీళ్లు బడినంక వీళ్లికి దుడ్లిచ్చి పంపిచ్చేకి తాను పెద్ద సావుకారేమీ కాదే? అట్లని మీ సాయమేమీ నాకొద్దు, మీ దారిన మీరు పోండప్పా అనేకి వాళ్ళు మామూలు మనుషులు కారే? ప్రభువులు పంపిన మనుషులను వద్దు పొమ్మని తిరస్కరిస్తే ప్రభువులకు ఆగ్రహం రాదా?"
ఆశ్చర్యంతో మొదలైన వారిదప్ప ఆలోచన కాస్త విషాదంగా పరిణమించింది. పాపం, ప్రభువుల అనుగ్రహం కూడా సామాన్యులకు మహాభారం అని ఆ ప్రభువులకు ఎట్లా తెలిసేది?
వారిదప్ప ఏమీ మాట్లాడకుండా, ఏమి చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా తలపట్టుకు కూర్చున్నాడు. పాపం, వారిదప్ప భార్య, ఆయన బిడ్డ కూడా ఏమి చేయాలో తెలియక బిక్కు బిక్కు మంటూ అలాగే కూర్చున్నారు. నిన్నటి వరకు ఎవరి సాయమూ లేకపోయినా హాయిగా సాగిన వారి పని, ఇప్పుడు ఇంతమంది సహాయానికి వచ్చినా ముందుకు సాగలేక ఆగిపోయింది. వచ్చిన మనుషులు కూడా ఏం చేయాలో తెలియక అలాగే వారి చుట్టూ కూర్చుండి పోయారు. ఎవ్వరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలో తెలియక సామూహిక మౌనవ్రతం ఆచరిస్తున్న మనుషుల్లా ఉండిపోయారు. అదీ జరిగిన కథ!
<><><>

మధ్యాహ్నసమయానికి వారిదప్ప బిడ్డ తన మెడలో ఉన్న గొలుసును తడుముకుంటూ ఉత్సాహంగా ఒక కేక వేసింది. "అమ్మా! అదిగో మామ వస్తున్నాడు"
దూరంగా వస్తున్న వారిని చూసి చుట్టూ కూర్చున్న మనుషులందరూ లేచి నిలబడ్డారు. వారు దగ్గరకు వచ్చి గుఱ్ఱాలు దిగగానే అందరూ తలలు వంచి, "ప్రభువులకు వందనాలు" అన్నారు.
వారిదప్ప కుటుంబం పొందిన భయసంభ్రమాశ్చర్యాలకు అంతే లేదు. తిమ్మరాయ ప్రభువు దగ్గరకు వచ్చి తన మేనకోడలిని ఎత్తుకున్నాడు. "ఏమి వారిదప్పా? వారికి పని చెప్పకుండా అట్లే కూర్చోబెట్టినావంట?" అన్నాడు నవ్వుతూ.
వారిదప్ప ఏమి మాట్లాడాలో తెలియక వినయంగా నమస్కారం చేసి నిలుచున్నాడు.
"వారిదప్పా! నేటినుండి నీవు రాజోద్యోగివి. ఇకపై నుండి వీరందరూ నీ అనుచరులు. నువ్వు వారిపై అధికారివి. నీకు, మా చెల్లెలికి ఇష్టమైతేనే సుమా! ముందు నీ చేనిలో బావి త్రవ్వకం పూర్తి చేసుకో. చెట్లు నాటు. ఆ తరువాత మన రాజ్యంలో పర్యటించి ఎక్కడ నీరు ఉందని నీకు అనిపిస్తే అక్కడ బావులు తవ్వించడం, చెట్లు నాటించడం నీపని. నీ చేతులమీదుగా మన రాజ్యం హరితసౌభాగ్యాన్ని పొందాలి. అది నా కోరిక!" అన్నాడు తిమ్మరాయ ప్రభువు.
"మహాప్రసాదం ప్రభూ!"
“"సరే, అందరికీ భోజనాలు కూడా తెప్పించాము, ప్రొద్దున నుండి అందరూ ఉపవాసం చేసి పుణ్యం బాగానే సంపాదించారు, ఇప్పుడు భోజనం చేసి కార్యరంగంలోకి ప్రవేశించండి! వారిదప్పా! నువ్వు మొదట చెట్లు నాటించబోయే నీ స్వగ్రామం ఇకపై నుండి "చెట్టూరు" గా పిలవబడుతుంది. మీ యింటిపేరు కూడా చెట్టూరు అవుతుంది!” అన్నారు ప్రభువులు చిరునవ్వు నవ్వుతూ.
"ధన్యుడిని ప్రభూ!" అన్నాడు శెట్టూరు వారిదప్ప.

((గమనిక: కథ కల్పితమే కానీ, కథలో వర్ణించబడిన పరిస్థితులు రాయలసీమలో నిజంగా ఉన్నవేనని, ఆ పరిస్థితులను నివారించేందుకు మన శెట్టూరు వారిదప్ప చెప్పిన విషయాలు పాటించదగినవే అని చదువరులు గ్రహించగలరు.))

అవ్యాజమైన ప్రేమ సాధ్యమా?

అవ్యాజమైన ప్రేమ?
అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా?
వ్యాజము అంటే కారణం లేదా సాకు.
నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా?
అనగా అనగా యాజ్ఞవల్క్యమహర్షి. అబ్బో, ఆయన సామాన్యుడు కానే కాదు. సూర్యభగవానుని శిష్యుడు. శుక్లయజుర్వేదపు ఆవిర్భావానికి కారకుడు. జనకమహారాజుగారి వేదాంతసభలో హేమాహేమీలైన మహా మహా పండితులెందరినో వాదప్రతివాదాలలో చిత్తుచిత్తుగా ఓడించినవాడు.
అటువంటి ఆయన ఒకరోజు గృహస్థాశ్రమం ముగించుకుని సన్న్యాసాశ్రమం స్వీకరిద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన ఇద్దరు భార్యలకు తనకున్న ఆస్తి పంచి ఇచ్చి సన్న్యాసి అయ్యేందుకు వారి అనుమతి కోరాడు.
కాత్యాయని అనే పేరు గలిగిన భార్య సరే అంది. కానీ మైత్రేయి అనే భార్య మాత్రం, "డబ్బుతో నిండిన ఈ మొత్తం భూమి నాకు స్వంతం అయితే నాకు అమృతత్వం (మోక్షం) వస్తుందా?" అని అడిగింది. అబ్బే, అలాంటి అవకాశం లేనే లేదు పొమ్మన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయితే దేనివల్ల అటువంటి అమృతత్వం సిద్ధిస్తుందో అది నాకు ఉపదేశిస్తేనే మీరు సన్న్యాసం స్వీకరించేందుకు అనుమతి" అన్నది మైత్రేయి.
యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వాడు. "ఇందువల్లనే నీవు నాకు ప్రియమైన భార్యవు అయ్యావు" అని పలికి, ఉపదేశం మొదలు పెట్టాడు.
ఎందువల్ల ఆమె ప్రియమైన భార్య అయింది? ఊరికే కాదు. ఏదో కారణం వల్లనే. యాజ్ఞవల్క్యుడే స్వయంగా చెప్పాడు తన ఉపదేశంలో -
न वा अरे जायायै कामाय जाया प्रिया भवति।
आत्मनस्तु कामाय जाया प्रिया भवति।
(बृहदारण्यकोपनिषद् 4.5)
"భార్యకోసం భార్య ఎప్పుడు ప్రియమైనది కాదు,
తన కోసమే భార్య ప్రియమైనది అవుతుంది."
యాజ్ఞవల్క్యుని విషయంలో - అతనికి ఇష్టమైనది అమృతవిద్య (ఆత్మవిద్య). అటువంటి అమృతవిద్యను కోరినందువల్ల మైత్రేయి అతనికి ఇష్టురాలైంది. లేకుంటే కాత్యాయని లాగే ఒక సాధారణమైన భార్య అయ్యుండేది అన్నమాట.
ఆ విధంగా ఒక్క భార్య విషయంలో మాత్రమే కాదు,
పుత్రుల కోసం పుత్రులు ఎవరికీ ఇష్టం కారుట.
తనకోసమే పుత్రులు ఇష్టులౌతారట.
నిజమే కదా, చిన్నప్పుడు వారి ముద్దు మురిపాలు మనిషికి ముచ్చట గొలుపుతాయి కాబట్టి వారి పట్ల ప్రేమ ఉంటుంది. పెద్దయ్యాక ఆ పిల్లలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వారి మీద కోపం తారాస్థాయిలో ఉంటుంది.
ధనం కోసం ధనం ఎవరికీ ఇష్టం కాదుట.
తనకోసమే (తనకు ఉపయోగపడుతుంది కాబట్టే) ధనం అంటే ఇష్టం ఉంటుందట.
అలాగే -
భార్యకు భర్త ఇష్టమైనా తనకోసమే తప్ప, భర్తకోసం కాదుట.
బ్రాహ్మణులనైనా, క్షత్రియులనైనా, పశువులనైనా, లోకాన్నైనా, దేవతలనైనా, వేదాలనైనా, ఇలా ఎవరిని (లేదా) దేనిని ఇష్టపడినా తనకోసమే కానీ వారి కోసం (లేదా వాటికోసం) మాత్రం కానే కాదుట.
కాబట్టి,
ఏవైనా, ఎవరైనా, మనకు ఉపయోగపడితేనే అవి మనకు ప్రియమైనవి అవుతాయి అని నిర్మొహమాటంగా చెప్పేశాడు ఆయన. ఎవరిమీదనైనా దేనిమీదనైనా నిష్కారణమైన ప్రేమ అంటూ ఉండదు, ప్రేమ సకారణమే అంటున్నాడన్నమాట.
అరెరే,
ఆయన అంత మాట అన్నాడని
మనం ఎవరమూ ముఖాలు మాడ్చుకోనక్కర లేదు.
మనసును చిన్నబుచ్చుకోనక్కరలేదు.
భుజాలు తడుముకోనక్కర లేదు.
ఎందుకంటే
ఆయన ప్రసంగం మానవుని స్వార్థబుద్ధి గురించి కాదు.
అమృతవిద్య గురించి కదా.
అందువల్ల ఆయన ధోరణిని కాస్త పరిశీలించి చూద్దాం.
"ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః"
"అన్నిటినీ (అందరినీ) తనవలె ఎవడైతే చూడగలడో అతడే అసలైన పండితుడు" - అని శాస్త్రం.
అంటే -
మనం మన పిల్లల్లో మనలను (ఆత్మను) చూసుకుంటున్నాం కాబట్టి వారు మనకు ఇష్టమౌతున్నారు. అంటే - ఆ క్షణంలో వారు వేరు, నేను వేరు అనే భావన మనలో ఉండదు - వారి విషయంలో దాదాపు అద్వైతసిద్ధి అన్నమాట. అదీ విషయం.
ఈవిధంగా మన పిల్లలనే కాదు, ప్రపంచంలో అన్నింటినీ ఆత్మస్వరూపాలుగా గమనించగలగడమే ఆత్మవిద్య అంటే - అదీ మోక్షవిద్య అంటే - అదీ అమృతవిద్య అంటే.
"ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి"
(అరే ఓ మైత్రేయి, ఇటువంటి స్వరూపం గల ఆత్మదర్శనం చేసుకోవాలి, దానిని గూర్చి వినాలి, మననం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి.)
"ఆవిధమైన అభ్యాసంతో నీవు అమృతవిద్యను సాధించగలవు" అని యాజ్ఞవల్క్యమహర్షి మైత్రేయికి ఆమె కోరిన అమృతవిద్యను ఉపదేశించాడు. (ఈ సందర్భానికి అవసరమైన కొద్ది భాగం మాత్రమే నేను తీసుకున్నాను. పూర్తి ఉపదేశం తెలుసుకోవాలనుకుంటే మిత్రులు బృహదారణ్యకోపనిషద్ చదవగలరు.)
ఈ క్రింది చిత్రం చూడండి. తల్లి ఆవు తన బిడ్డకు పాలను ఇస్తోంది. కొంత దూరంతో తల్లి లేని దూడలు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు వాటిని పిలిచి పాలు ఇవ్వడం లేదు. ఒకవేళ అవి చొరవగా వచ్చి పాలు త్రాగబోయినా ఈ ఆవు సరేనని వాటికి కూడా ఇస్తుందో లేక తిరస్కరిస్తుందో తెలియదు.
అపుడపుడు ఆవు పందిపిల్లలకు కూడా పాలు ఇస్తున్న ఫోటోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆవులు అమృతవిద్యను సాధించిన మహర్షులుగా భావించి మనం వాటికి నమస్కరించవలసిందే!

Monday, 17 December 2018

వాళ్లు కూడా భారతీయులే

"పలువిద్య లెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!"
అనే మాటను ఇంకా పట్టుకుని నిష్ఠగా పాటించే వారు ఉన్నారా?
అనంతపురంలో ఒక మిత్రుడు తన యువమిత్రుని ఒకరిని నాకు పరిచయం చేశాడు. ఆ యువకుడు ఫేస్ బుక్ లో కూడా ఉండేవాడు. మాంచి హుషారైనవాడు. తన వయసుకు తగిన పోస్టులు పెట్టుకుంటూ సందడి సందడి చేస్తూ ఉండేవాడు.
అయితే గత రెండు మాసాలుగా ఫేస్బుక్ లో లేకుండా అదృశ్యమై పోయాడు. ఏమయ్యాడు అని అతని గూర్చి మా మిత్రుని అడిగితే -

"అతడు పెద్దగా చదువుకున్నది లేదు,  అతనికి అతని వృత్తివిద్య ఒకటే వచ్చేది.  దాన్ని చేసుకుంటూ వయసులో చిన్నవాడైనా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కాలం గడిపేస్తూ ఉండేవాడు.   కానీ, అతని పని కాస్త మోడీ గారి డీమానిటైజేషన్ సంస్కరణతో ఒడిదుడుకులకు లోనైంది. అందువల్ల ఎలా సంపాదించుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అనే చింతలో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాడు పాపం!"  అని విచారం వ్యక్తం చేశాడు.
ఈకాలంలో కూడా వృత్తివిద్యను మాత్రమే మనసా వాచా కర్మణా నమ్ముకొని మరొకదాని జోలికి వెళ్లని వారు కూడా ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది.
పరిశ్రమలు వచ్చి గ్రామీణ కులవిద్యలను చిన్నాభిన్నం చేసేశాయి.

మనకు నేతవాడు అక్కరలేదు,
డిగ్ జామ్, బాంబే డయింగ్, రేమాండ్ కంపెనీల బట్టలు దొరుకుతున్నాయి.
మనకు కంసాలివాడు అక్కరలేదు,
కళ్యాణ్, తనిష్క్, జోయాలుక్కాస్, కంపెనీల నగలు దొరుకుతున్నాయి.
మనం పశువులనే పోషించం, కాబట్టి గొల్లవాడు అక్కరలేదు.
వీధి వీధిలోనూ హెరిటేజ్ పాలు దొరుకుతున్నాయి.
మనకు చెప్పులు కుట్టేవాడు కూడా అక్కరలేదు,
బాటలు, ఆదిదాసులు, రీబాకులు, నైకులు పిలిచి కాళ్ళొత్తుతున్నాయి.
అసలెవరూ అక్కర్లేదు.
రెడీమేడ్ ప్రపంచం మనలను ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది!

మరెవరు కావాలి?
పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారుడు కావాలి.
వాళ్ళ దగ్గర జీతం తీసుకుని పనిచేసి పెట్టే పెద్ద పాలేరులం మనమే కావాలి.

సరే, అలాగే.
కానీ,
ఆ నేతగాడు, కంసాలి, గొల్లవాడు, చెప్పులు కుట్టేవాడు - ఇలాంటి వృత్తివిద్యలను నమ్ముకున్నవాళ్ళు పొట్టమాడ్చుకుని అలాగే చావాలా?

వేలాది సంవత్సరాలుగా ఆయా కులవిద్యలు తప్ప మరొకటి తెలియని వారు హఠాత్తుగా మరొక భాషలో చదువులను నేర్చుకొనడం ఎంత కష్టం? మాకు కూడా పైకి ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చేందుకు ఎందుకు మనం మనసు కష్టపెట్టుకోవాలి ?

పుట్టి ఎదుగుతున్న మన ఇంటి శిశువు మనంత తెలివిగా ప్రవర్తించలేడు. మనంత హుషారుగా ప్రపంచంలో జొరబడి పనులు చేసుకురాలేడు. వెచ్చాల అంగడికి ఒక్కడే పోయి ఒక వస్తువును తీసుకువస్తే వాడు మోసపోయాడా లేక చిల్లర సరిగా తీసుకువచ్చాడా అని పదే పదే చూస్తూ, హెచ్చరిస్తూ, వాడు ఎదిగేందుకు తోడ్పడుతూ, స్వతంత్రంగా వ్యవహరించే వయసు వచ్చే వరకు అనుక్షణం రక్షిస్తూ ఉంటాం.

ఆపద్ధర్మాలు అందరికీ ఉన్నాయని మనువు చెప్పాడు. మరి, ఎంతో ప్రేమతో, మమకారంతో, తరతరాలుగా తాము గొప్ప నైపుణ్యం గడించిన వృత్తివిద్యలను శాశ్వతంగా కోల్పోయి, కూటికి ఉపయోగపడే క్రొత్తవిద్యలను అభ్యసించేందుకు, బ్రతికేందుకు తాపత్రయపడుతూ, తప్పటడుగులు వేస్తున్న చిన్ని శిశువులవంటి మనుషులను మనం ప్రేమాభిమానాలతో ఆదరించాలి కదా? ప్రోత్సహించాలి కదా? వారందరూ మన ఇంటివారు కాదేమో అని ఎవరికీ సందేహం వద్దు.

మానవులందరూ ఒక తల్లి నుండి పుట్టినవారేనని మనమందరం ఆరాధించే రామాయణమే స్వయంగా చెబుతోంది. 

)))(((

(నేను వ్రాసిన ఈ క్రింది వ్యాసం మునుపు ఆసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

మనుస్మృతిని తగలబెడతాం అని కొందరు అంటారు. 
అయ్యయ్యో ఏమిటీ ఘోరకలి అని నెత్తీనోర్లు బాదుకుంటారు మరికొందరు. 
 భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తాం కదా?  మరి సహోదరుల నడుమ ఈ గొడవలేమిటి?  భారతీయులలో కనిపించే కులమే దీనికి కారణం అంటారు అందరూ.  ఈ కులాల వారు ఈ పనులే చేయాలి, ఆ కులాల వారు ఆ పనులే చేయాలి అని మనుస్మృతిలో చెప్పబడింది.  సరే, ఈ రోజుల్లో ఆయా పనులను వారు మాత్రమే చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు.    నాలుగు వర్ణాలు ఉన్నాయట.  (వాటినే కులాలుగా అందరూ అనుకుంటున్నారు.  ఆయా వర్ణాలలో లెక్క లేనన్ని శాఖోపశాఖలు ఉన్నప్పటికీ) 
అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా.
దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్రజన్మనః   (మనుస్మృతి 10.75)
చదువు చెప్పడం, చదువుకొనడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడం, దానం స్వీకరించడం –
ఈ ఆరు పనులు బ్రాహ్మణుల ధర్మాలు అన్నారు.
కానీ, భృగువంశపు బ్రాహ్మణుడైన పరశురాముడు ఆయుధం పట్టి క్షత్రియజాతిని నామావశిష్టం చేసేశాడు.  ఆ పాపం పోగొట్టుకొనడం కోసం ఘోరమైన తపస్సు  చేశాడు.
బ్రహ్మగారి మునిమనుమడు, పులస్త్యవంశపు  బ్రాహ్మణుడైన రావణుడు ఆయుధాలు ధరించి లోకాలన్నింటినీ పీడించి పీడించి పెట్టాడు.  ఆయనను దుష్టశిక్షణలో భాగంగా రాముడు హతమార్చాడు.  చివరకు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకునేందుకు శివలింగప్రతిష్ఠను గావించాడంటారు.
ఈ విధంగా బ్రాహ్మణులు స్వధర్మం వదిలి పెట్టి యుద్ధాలు చేబట్టడం తప్పు  కదా? 
ఏదైనా కారణం చేత ఆ ఆరు పనులు చేయలేకపోతే పరిస్థితి ఏమిటి? 
అందుకని ముందుగానే ఆ పరిస్థితులను ఊహించి ఆపద్ధర్మాలు వచ్చాయి.
జీవేత్ క్షత్రియధర్మేణ స హ్యస్య ప్రత్యనన్తరః (10.81)
"అలా అయితే బ్రాహ్మణులు క్షత్రియధర్మాన్ని (ఆయుధాలను ధరించి ప్రజారక్షణ చేయడం) అనుసరించి జీవించవచ్చు" అన్నారు.
భారతంలో ద్రోణుడు, అశ్వత్థామ ఇలాగే జీవించినవారు.  కానీ, వారు మహా తేజస్వులు, ధీరసత్త్వులు.  అందరికీ వారిలా జీవించడం చేతకాదు కదా?   మరి క్షత్రియుల పని కూడా అందరికీ చేతగాకపోతే?
ఉభాభ్యామప్యజీవంస్తు కథం స్యాదితి చేద్భవేత్
కృషిగోరక్షమాస్థాయ జీవేద్వైశ్యస్య జీవికామ్. (10.82)
"అటు బ్రాహ్మణుల పనిని గాని, ఇటు క్షత్రియుల పనిని గాని చేయలేకపోతే వ్యవసాయం చేసుకోవచ్చు,  గోరక్షణ చేసుకుంటూ ఉండవచ్చు.  వైశ్యుడిలా బ్రతకవచ్చు"  అన్నారు.
సద్యః పతతి మాంసేన లాక్షయా లవణేన చ
త్ర్యహేణ శూద్రో భవతి బ్రాహ్మణః క్షీరవిక్రయాత్. (10.92)
బ్రాహ్మణుడు మాంసాన్ని కానీ, లక్కను కానీ, ఉప్పునుగాని అమ్మితే వెంటనే శూద్రుడు అవుతాడు, పాల అమ్మకం మొదలు పెడితే కేవలం మూడంటే మూడురోజులలోనే ఆ బ్రాహ్మణుడు కాస్త శూద్రుడు అయిపోతాడు అన్నారు. 
ఈ క్రమాన్ని చూస్తుంటే చతుర్వర్ణాల ఆవిర్భావం ఎలా జరిగిందో అర్థం అవుతున్నట్టు లేదూ?  బ్రాహ్మణుడిని ముఖంగా, క్షత్రియుడిని భుజాలుగా, వైశ్యుని ఊరువులుగా, శూద్రుని పాదాలుగా కలిగిన సమాజమనే పురుషస్వరూపం గోచరించటం లేదా?  ఒకే వ్యక్తి సంతానం చిన్నా పెద్దా  తమకు చేతనైన పనులను చేస్తూ క్రమంగా,  బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విస్తరించినట్లు, ఒక Clue దొరికినట్లు లేదూ?  
వాల్మీకి రామాయణం - అరణ్యకాండం, పద్నాల్గవ సర్గ చదివితే - దక్షప్రజాపతి కూతురైన మనువును కాశ్యపమహర్షి వివాహం ఆడారని,  ఆ మనుసంతానమే - క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని స్పష్టంగా ఉంది.  (అరణ్యకాండం, 14.29)  ఆ మనువు సంతానపరంపరనే మనం మానవులు అంటున్నాం.   బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ఎవరైనా అందరూ మానవులే -
ఈ లెక్కన అగ్రకులం అంటే తల్లిదండ్రులకు ముందుగా పుట్టిన బిడ్డ యొక్క సంతానం, వారి పరంపర అన్నమాట.  (అగ్ర అంటే మొదట అని అర్థం.)  నిమ్నకులాలు అంటే సంతానక్రమంలో క్రిందుగా (తరువాత) పుట్టిన బిడ్డల సంతానం అన్నమాట. 
అంటే అందరికంటే ముందుగా పుట్టిన బ్రాహ్మణుని సంతానం అందరికీ అగ్రజులు.  అలాగే - రెండవ సంతానమైన క్షత్రియుడు బ్రాహ్మణుడికి నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన వైశ్యునికి అగ్రకులం వాడు.  అలాగే వైశ్యుడు తన ముందుపుట్టిన బ్రాహ్మణ క్షత్రియులకు నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన శూద్రునికి అగ్రకులం వాడు.  అందరికంటే చివరగా పుట్టిన శూద్రుడు అంత్యజుడు.  ఈ రోజుల్లో పెద్దవాణ్ణి అన్నా అని, పెద్దోడా అని, చిన్న వాడిని తమ్ముడూ అని, ఒరే చిన్నోడా అని అందరూ పిలుస్తున్నట్లే  అప్పట్లో అగ్రజా అనడం, అంత్యజా అనడం సహజం అయి ఉంటుంది. 
కాబట్టి ఈ నలుగురూ పూర్వకాలంలో ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన సహోదరులు!  వీరు కాక పంచములనబడే ఐదవ జాతి లేదు గాక లేదు అని మనుస్మృతి స్పష్టంగా చెబుతోంది.   (నాస్తి తు పంచమః  10.5)
మొదటి సంతానానికే రాజ్యాన్ని, పెత్తనాన్ని అప్పగించే సంస్కృతి, చిన్నవారిని వివిధ పనులకు పురమాయించే పధ్ధతి, ఇప్పటికీ భారతీయ గృహాల్లో సహజమే  కదా!  
కానీ క్రమంగా తరాలు గడుస్తున్నా కొద్దీ అన్నల పిల్లలు తమ్ముళ్ల  పిల్లల మీద పెత్తనం చెలాయించడం తమ హక్కులా భావించడం మొదలైంది.  పైగా చదువుకున్న అన్న తప్పు చేసినా శిక్ష స్వల్పంగా ఉండటం, చదువుకోకుండా గొడ్డు చాకిరీ చేస్తున్న తమ్ముడు ఎపుడైనా అన్న నిర్దాక్షిణ్యంగా చేయిస్తున్న  శ్రమపురితమైన పనికి తట్టుకోలేక  కోపమొచ్చి కేకలేసినా వాడికి కఠినమైన దండన ఉండటంతో, మానసికమైన దూరం బాగా ఎక్కువైపోయింది.  చిన్నోడా అనే పిలుపు అవమానానికి ప్రతీకగా భావించడం మొదలైంది.   
అసలు ఈ రోజుల్లో రెండు మూడు తరాలు గడిచే సరికి తమ బంధువులెవరో కూడా తెలియటం లేదు.  అటువంటిది, కొన్ని వేల తరాలకు పూర్వం మేమందరం అన్నదమ్ముల బిడ్డలం అని తెలుసుకొనడం సాధ్యమేనా? 
మనుస్మృతి కాలం నాటి ఆయా వర్ణధర్మాలను ఈ రోజుల్లో ఎవరు ఖచ్చితంగా పాటిస్తున్నారు గనుక?   అధ్యయనం (చదువు) అనేది మొదటి ముగ్గురన్నదమ్ముల బిడ్డలకు మాత్రమే చెప్పి తమ్ముని బిడ్డను వేలాది సంవత్సరాల అజ్ఞానపు దిగుడుబావిలో అట్టడుగున సొరంగంలో అంధకారంలో ఉంచడం తప్పుగాక మరేమిటి?  ఆ బ్రాహ్మణుల విద్యలు చాలా గొప్పవే -  సందేహం లేదు - కానీ, అనేక శారీరకశ్రమలకోర్చి అందరినీ సేవించుకొనే అంత్యజునికి ఆ విద్యలు ఎంతమాత్రం సుఖాన్ని కలిగించాయి?  పోనీ ఈ అగ్రజులైనా తాము వేలాది సంవత్సరాలుగా అంత్యజులకు చెప్పకుండా దాచుకున్న విద్యను తాము రక్షించుకోగలుగుతున్నారా?  వారు కూడా తమ విద్యలను నిర్దాక్షిణ్యంగా వదిలి పరదేశపు విద్యలకు ఎగబడుతున్నారే? 
ఇటువంటి కాలంలో కూడా తమ మీద అగ్రజుల పెత్తనం ఏమిటి అని తమ్ముళ్లు అనుకోరా?  సహజంగానే తమ్ముళ్ల పిల్లలకు  ఈ పెత్తనం నచ్చటం లేదు.  తిరుగుబాటు చేస్తున్నారు. 
1 అప్పట్లో పురాణాలలో కనబడే  బ్రాహ్మణక్షత్రియుల సంఘర్షణలైతే నేమి,
2 ఆ తరువాత సార్థవాహులపై దాడి చేసి దస్యులు దోచుకొనడమైతే ఏమిటి,
3 ఈరోజుల్లో మనుస్మృతి తగులబెట్టి, మాకు రిజర్వేషన్లు ఉండాలి, మాకు కూడా అధికారం కావాలి అనడం అయితే ఏమిటి,  ఇవన్నీ కూడా ఆ తిరుగుబాట్లలో భాగాలే.    
పైవాటిలో
మొదటి రకం తిరుగుబాట్లను "పురాణకథలుగా భావించి ఆహా" అని అనుకొనడం,
రెండవ రకం తిరుగుబాట్లను "ఓహో చరిత్ర ఇలా ఉండిందా" అని భావించడం,
మూడవ రకం తిరుగుబాట్లను "దేశద్రోహంగా, జాతిద్రోహంగా, సంస్కృతి పట్ల ద్రోహంగా   భావించడం" ఎంతవరకు సమంజసం?
"తమ పనిని తాము చేయలేకపోతే ఇతరుల పనులను చేయవచ్చును" అని మనుస్మృతిని వ్రాసుకున్న అగ్రజులు,  వేలాది తరాలుగా కట్టుబానిసల్లా తమకు సేవలు చేసిన  అంత్యజులు మేము ఇకపై ఇటువంటి పనులను చేయలేము అని చెబుతూ ఉంటే - "సరేలే తమ్ముళ్లూ" అంటూ వారిని అవమానించడం మానివేసి, వారికి కూడా ప్రేమాభిమానాలను పంచుతూ, ఆదరిస్తూ, చిరునవ్వుతో వారు చేయగలిగిన పనులను వారిని చేయనిస్తే ఎంత హాయిగా ఉంటుంది?  

నేను సైతం వివక్షాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను!

  1. హిడింబ ఒకరోజు ఏదో వ్రతం మొదలుపెట్టింది.
  2. ఎందుకమ్మా వ్రతం అని ఘటోత్కచుడు అడిగితే "నాయనా! మీ తండ్రిగారైన భీమసేనుని చూసి చాలకాలమైందిరా! భర్తృదర్శకమనే ఈ వ్రతాన్ని ముగించేసరికి మనకు ఆయన దర్శనమిస్తారు. ఈరోజు సాయంత్రం వ్రతాన్ని ముగించి ఓ మాంచి మనిషిని భోంచేస్తే వ్రతం ముగిసినట్టే. అందుగ్గాను ఎవరైనా దొరుకుతారేమో పట్రాపో" అని చెప్పింది. మాతృవిధేయుడైన ఘటోత్కచుడు సరేనని బయలుదేరాడు.
  3. వానికి అడవిలో ఇద్దరు పెద్దవయసు బ్రాహ్మణదంపతులు, వారి ముగ్గురు కుమారులతో కనబడ్డారు. రాక్షసుణ్ణి చూసేసరికి వాళ్లు హడలిపోయి ప్రాణాలమీద ఆశ వదిలేసుకున్నారు. అతడు "మేము రాక్షసులమైనా నరమాంసభక్షకులం కాదయ్యా, భయపడకండని" వారికి చెప్పి, మీలో ఒకరు మా తల్లికి వ్రతానంతరఫలహారమయ్యేందుకు సిద్ధపడి నాతో వస్తే మిగిలిన నలుగురిని క్షేమంగా వదిలేస్తానన్నాడు. నరమాంసం తినమని ఓవైపు చెబుతూనే మాలో ఒకరిని అతని తల్లికి ఫలహారం ఐపొమ్మంటున్నాడేమిటీ తిక్కలోడని వాళ్లు తికమకపడ్డారు.
  4. "నేను కుటుంబయజమానిని. వారిని రక్షించాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను మీ తల్లికి ఫలహారంగా వస్తాను. నన్ను తీసుకుపో రాక్షసోత్తమా" అన్నాడు ఆ ముసలి బాపడు. "వద్దయ్యా! ఎముకలపోగైన నీవు మా అమ్మ పంటిక్రిందకు చాలవు" అన్నాడు ఘటోత్కచుడు.
  5. "నన్ను తీసుకుపో రాక్షసకుమారా!" అన్నది ఆ వృద్ధబ్రాహ్మణస్త్రీ. "మా తల్లి వంటి కరుణామయి స్త్రీలను ఆహారంగా స్వీకరించలేదమ్మా! మీరు వద్దు" అన్నాడు ఘటోత్కచుడు.
  6. అపుడు నన్ను తీసుకుపొమ్మంటే కాదు నన్నంటూ ముగ్గురు కుమారులూ ముందుకొచ్చారు. ఘటోత్కచుడు విసుక్కొని, "నాక్కావలసింది ఒకరేనయ్యా! మీ ముగ్గురిలో ఎవరో ఒకరే ముందుకురండి!" అన్నాడు.
  7. అపుడు ఆ తండ్రి "జ్యేష్ఠకుమారుడు వంశాన్ని నిలుపవలసినవాడు, శ్రాద్ధాదికర్మలతో పితృకర్మలు చేయవలసినవాడు. వాణ్ణి నేను వదలను" అన్నాడు.
  8. ఆ తల్లేమో - "కనిష్ఠపుత్రుడు నాకు అత్యంతప్రియతముడు. నాకు వాడు ఇప్పటికీ స్తనంధయుడనే అనిపిస్తాడు. వాణ్ణి నేను వదలను" అన్నది.
  9. అపుడు రెండవకుమారుడు ముందుకు వచ్చి "సరే. నన్ను తీసుకొనిపో రాక్షసేంద్రా! కాని, చివరిసారిగా సంధ్యావందనం చేసుకొనే అవకాశమివ్వు" అన్నాడు. "సరే! ఆ వైపు ఓ జలాశయముంది. అక్కడ సంధ్యవార్చుకుని వెంటనే వచ్చేసెయ్." అని ఘటోత్కచుడు అనుమతించాడు. అలా వెళ్లిన అతడు ఎంతకూ తిరిగిరాలేదు.
  10. ఘటోత్కచుడికి విసుగొచ్చి, "మీ వాణ్ణి రమ్మని కేకవేయండి" అని వారిని అడిగాడు. "చావడానికి రమ్మని వాణ్ణి ఎలా పిలువగలం? నువే పిలుచుకోపో!" అన్నారు వారు. "సరే! నేనే పిలుస్తా! ఆ అబ్బాయి పేరేమిటి?" అని అడిగాడు ఘటోత్కచుడు. అదిగూడా చెప్పము పొమ్మన్నారు వారు. చేసేదేమీ లేక ఘటోత్కచుడు ఇద్దరు పిల్లల మధ్యలో పుట్టినవాణ్ణి మనం "ఒరే నడిపోడా" అని పిలిచినట్లుగా "ఓ మధ్యమా! త్వరగా రావయ్యా!" అని గట్టిగా రెండుమూడుసార్లు పిలిచాడు.
  11. "ఎవరయ్యా అది? ఎందుకు నన్ను పిలుస్తున్నారు?" అంటూ ఒక బలిష్ఠుడైన వ్యక్తి అక్కడకొచ్చాడు. అతడే భీముడు. కుంతీకుమారుల్లో రెండవవాడైన అతడికి "మధ్యమా" అన్న పిలుపు అలవాటే. అలా వచ్చిన భీముడికి ఆ పిలిచినవాడు తన కొడుకు ఘటోత్కచుడని తెలియదు. తాను పిలవగా వచ్చినవాడు తన తండ్రి భీముడేనని ఘటోత్కచుడెరుగడు. సరే. అక్కడి పరిస్థితిని క్షణాల్లో పసిగట్టేశాడు భీముడు. మాటలసందర్భంలో వాడు తన కొడుకేనన్న సంగతిని కూడా కనిపెట్టేశాడు.
  12. "కుమారా! వారినొదిలిపెట్టవయ్యా! ఆ బ్రాహ్మణకుమారుడి స్థానంలో నేనొస్తాను" అన్నాడు భీముడు. "నన్ను కుమారుడనడానికి మీరెవరయ్యా?" అంటూ కయ్యిమన్నాడు ఘటోత్కచుడు. "నేను క్షత్రియుడినయ్యా! క్షత్రియుడు అందరికీ తండ్రిలాంటివాడు కదా!" అన్నాడు భీముడు. "సరే అయితే! వస్తానన్నావుగా మరి! బయలుదేరు. నాతో రా!" అన్నాడు ఘటోత్కచుడు. భీముడికి కొడుకు బలాన్ని చూడాలని కోరిక కలిగింది. "చెప్పానుగా, నేను క్షత్రియుణ్ణని? ఒకరు రమ్మని ఆజ్ఞాపిస్తే వచ్చేవాణ్ణి కాదు. నీకు చేతనైతే నన్ను తీసుకుపో చూదాం" అన్నాడు.
  13. దాంతో ఇద్దరికీ కాసేపు యుద్ధం జరిగింది. కాసేపు కుస్తీపట్లు, కాసేపు శస్త్రాలు, కాసేపు మాయలు, కాసేపు అస్త్రాలు... అలా... కాసేపు భీముడిది పైచేయి అయితే కాసేపు ఘటోత్కచుడిదే పైచేయి అయింది. ఎంత చేసినా భీముణ్ణి వంచలేకపోయాడు ఘటోత్కచుడు. కాని, భీముడికి మాత్రం కొడుకు యుద్ధకౌశలం పరమానందం కలిగించింది. చివరకు విసుగెత్తిన ఘటోత్కచుడు, "ఇదుగో, ఏమయ్యోయ్! మాట్లాడితే చాలు! నేను క్షత్రియుణ్ణి క్షత్రియుణ్ణి అంటావ్! సుక్షత్రియులెవరూ ఆడిన మాట తప్పరు! కాబట్టి, నాకిచ్చిన మాట ప్రకారం నాతో రా!" అన్నాడు. "సరే, పద!" అని భీముడు బయలుదేరాడు.
  14. కొడుకుతో పాటు వచ్చిన భర్తను చూసి, హిడింబ తన ఉపాయం ఫలించినందుకు సంతోషపడింది. "ఉరే నాయనా! ఇతడేరా మన ఇద్దరిపాలిటి దైవం!" అని కొడుకుకు అతని తండ్రిని పరిచయం చేసింది. పాండవులు రాజ్యం కోల్పోయి ఈ దగ్గరలోనే వనవాసం చేస్తున్నట్టు తనకు తెలియవచ్చిందని, భీముని చూడాలనే కోరికతోనే బ్రాహ్మణున్ని తెమ్మని ఘటోత్కచుని కోరానని, బ్రాహ్మణరక్షణకు పాండవులు తప్పక వస్తారని, అపుడు భీమదర్శనమౌతుందని ఊహించానని వివరించింది. కుటుంబసభ్యులందరూ సంభ్రమాశ్చర్యాలతో మళ్లీ కలుసుకున్నారు. బ్రాహ్మణరక్షణ పేరుతో వీరరసపోషణ కూడా జరిగింది. కథ సుఖాంతమైంది. 
  15. కానీ...
  16. కానీ...
  17. సాక్షాత్తు కన్న తల్లిదండ్రులలోనే వివక్షా? 
  18. తమ సంతానంలో కొందరిపట్ల అధికమైన ప్రేమ, కొందరిపట్ల తక్కువ ప్రేమ ఉంటుందా? ఈ కథ మహాభారతంలోనిది కాదు. మానవమనస్తత్త్వంలోని ఈ కోణాన్ని అట్టే దూషించకుండా ఆత్మవిమర్శాత్మకమైన ఆలోచనకు బీజం వేస్తూ మధ్యమవ్యాయోగం పేరిట రమణీయమైన రూపకంగా మలిచిన ఘనత, కాళిదాసు కన్నా పూర్వీకుడైన భాసమహాకవిది. ఆయన కూడా ఐతరేయబ్రాహ్మణంలోనూ, రామాయణంలోనూ, దేవీభాగవతంలోనూ ప్రసిద్ధమైన శునశ్శేఫోపాఖ్యానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రచించాడు. కాబట్టి, మానవులలో ఎంతో కొంత వివక్ష అంతర్లీనంగా ఉన్నదనే విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారన్నమాట!
  19. అలా మనలో కూడా దాగి ఉన్న వివక్షను గూర్చి మరిన్ని విషయాలను ఇక్కడ చదవండి:


(ఈ క్రింది వ్యాసం మునుపు ఆసియానెట్ లో ప్రచురింపబడింది.)

మాయాబజార్ సినిమా చూసినవారందరికీ గుర్తు ఉండే ఉంటుంది – “నీవు శశిరేఖను పెళ్లి చేసుకోవాలి నాయనా” అని శకుని లక్షణకుమారుడితో చెబితే - "సిగ్గు సిగ్గు!  ఆ అనాగరిక యాదవ సామంతరాజు కన్యను పెండ్లాడుటయా?" అని మహా చులకనగా తీసిపడేస్తాడతడు.  అతని మాటలలోని భావాన్ని ఏమందాం?  యాదవులంటే అతనికి చులకన అందామా?  యాదవులంటే వివక్ష అందామా?  ఈ రెండుపదాలనూ  ఇప్పుడు తెలుగువారు ఒకే అర్థంలో వాడేస్తున్నారు.   

అసలు వివక్ష అనే సంస్కృతపదానికి - "చెప్పాలనే కోరిక" అని అర్థం.  (वक्तुम् इच्छा विवक्षा।)  హిందీ డిక్షనరీ చూసినా कुछ कहने की इच्छा అనే అర్థమే కనిపిస్తుంది.  కాని, మనం తెలుగుభాషలో  వివక్ష అంటే భేదభావం లేదా పక్షపాతబుద్ధి అనే అర్థాలలో విచ్చలవిడిగా వాడేస్తున్నాం.  విభిన్న రూపురేఖలు, విభిన్నవర్ణభేదాలు, విభిన్నమైన ఆచారవ్యవహారాలు, విభిన్నమైన ఆహారపుటలవాట్లు కలిగిన విశాలమైన భూమి మనది.  ఆయా ప్రజలు తమదైన ఆచారవ్యవహారాలు, దేశం, భాష, మొదలైనవాటిపట్ల అభిమానం కలిగివుండటం సహజమే.  అందులో తప్పేమీ లేదు.  "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"  అని ఆనందపడేంతవరకు ఫరవాలేదు.  కానీ, వేరొకరి వర్ణం పట్ల, ఆచారాలపట్ల, ఆహారాదులు మొదలైనవాని పట్ల చులకనభావాన్ని కలిగి, వాటిని లేదా వారిని దూషించి, చిన్నబుచ్చి, తన ఆధిపత్యాన్ని చాటుకొనే పద్ధతికి  ప్రస్తుతం "వివక్ష" అనే పదం స్థిరపడింది. 
పైన చెప్పుకున్న అర్థంలో వివక్షాపూరితమైన ఎన్నెన్ని వ్యవహారాలు జరిగాయని!  అటువంటి బోలెడన్ని వ్యవహారాలు పురాణాలలో కూడా రికార్డయి భద్రంగా ఉన్నాయి! 
రామాయణంలోని రావణాసురుడు ఉన్నాడే - అతడు కూడా మానవులంటే వివక్ష చూపించాడు.  అతడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి  బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "మనవడా, ఏమి వరం కావాలో కోరుకోవయ్యా" అని అడిగితే - "నాకు దేవదానవగంధర్వయక్షరాక్షసకిన్నరకింపురుషనాగాదులు ఎవరివల్లా చావురాకూడదని" కోరుకున్నాడట.  నరవానరులను తన లిస్టులో పొరబాటున మరచిపోయాడనుకొనేరు! “వీళ్ళ ముఖం!  వీళ్ళు నన్ను కొట్టే మొనగాళ్లా?” అనే చులకనభావంతో, కావాలని లిస్టులో నరవానరుల పేర్లు కొట్టేశాడు.  కానీ, చివరకు ఏమైంది?  అతని వివక్షే అతని పాలిట మృత్యువైంది.  నరవానరులే అతని లంకాసామ్రాజ్యాన్ని నాశనం చేశారు.  కాబట్టి, నీతి ఏమిటంటే ఎవరైనా తమ బాగు తాము కోరుకుంటే వారికి వివక్ష ఉండరాదు అని.      
ఇంద్రుడు అంగుష్ఠమాత్రులైన వాలఖిల్యులను చూసి ఒకసారి అవహేళనగా నవ్వాడట.  వారు ఎంత పొట్టివారైనప్పటికీ మహాతపస్సంపన్నులు.  "ఓయ్ ఇంద్రా!  నీ పొగరును అణిచేందుకు మరో ఇంద్రుడు పుట్టుకొస్తాడులే!" అనేశారు.  ఆ తరువాత గరుత్మంతుడు పుట్టుకొచ్చాడు.  అతడు స్వర్గంనుండి అమృతాన్ని తీసుకుపోతూండగా కోపించిన ఇంద్రుడు అతని మీదకు వజ్రాయుధం విసిరినా చెక్కుచెదరలేదు.  కానీ ఇంద్రుడి పరువుపోతుందేమో అని జాలిపడిన గరుత్మంతుడు తన రెక్కనుండి ఒక ఈకను క్రిందపడేలా విదిలించాడట.  ఆ దెబ్బకు ఇంద్రుడు బెదిరిపోయి బావురుమంటే - "సరే, నువ్వు దేవేంద్రుడుగా ఉండు, గరుత్మంతుడు పక్షీంద్రుడుగా ఉంటాడులే" అని పెద్దలు వారిమధ్య రాజీ కుదిర్చారట.  
కాబట్టి ఎలాగైనా వివక్ష భయహేతువు కాకమానదు. 
గురుపుత్రుల శాపంతో త్రిశంకుడు చండాలుడైపోయాడు. అతనిని బొందితో స్వర్గానికి పంపేందుకు గాను విశ్వామిత్రుడు యజ్ఞం చేయతలపెట్టాడు.  వివిధమునులకు ఆహ్వానం పంపించాడు.  చాలామంది వచ్చారు కానీ, కొందరు మాత్రం, అవహేళనగా "ఏమిటేమిటీ?  ఆ జరుగుతున్న యజ్ఞానికి యజమాని చండాలుడున్నూ, ఆ యజ్ఞం చేయించేవాడు క్షత్రియుడూనా?  ఇలాంటి యజ్ఞానికి మేము రామంటే రాము పొమ్మన్నారు". దాంతో వళ్ళు మండి విశ్వామిత్రుడు పెట్టిన శాపం దెబ్బకు వారు నీచాతినీచమైన జన్మలను పొందవలసి వచ్చిందట.    
గొప్ప గొప్ప వాళ్ళని పేరుపడిన వాళ్లకు కూడా కారణాలు ఏమైనప్పటికీ అంతో ఇంతో వివక్ష ఉండనే ఉండింది.  
“మనం ఇద్దరం చిన్ననాటి మిత్రులం కదా” అని ద్రోణుడు ద్రుపదుని చెంతకు పోతే, “నేను ధనవంతుడిని, నీవు ధనహీనుడివి.  మన ఇద్దరి మధ్య మైత్రి పొసగదు పొమ్మని” ద్రుపదుడు చీదరించుకున్నాడు.  అపుడు ఎంతో బాధపడిన ద్రోణుడు అదంతా మరచిపోయి తనవద్దకు అస్త్రవిద్య నేర్చుకునేందుకు వచ్చిన ఏకలవ్యుడిని “నీవు నిషాదజాతికి చెందినవాడవు కాబట్టి నేర్పను పొమ్మన్నాడు.”  
స్త్రీల పట్ల భీష్ముడికున్న లోకువ ఎటువంటిదంటే వారు తనను చంపవచ్చినా వారితో పోరాడను అనేటటువంటిది.  
శల్యుడు కర్ణుడు అయితే మరీను, వారు పరస్పరద్వేషంతో ఎదుటివారి దేశాచారాలను, ఆ దేశప్రజలను కూడా నోటికొచ్చినట్టు తూలనాడారు. 
భీముడంటే దుర్యోధనుడికి చిన్నతనంనుండి తగని మంట.  భీముడిని చంపేందుకు శతవిధాల ప్రయత్నించి సాధ్యం కాక ఆ అక్కసు తీర్చుకొనేందుకు భీముడికి ఎంతో ఇష్టమైన అతని రథసారథిని (సూతుడిని) చంపేశాడు.  సూతుడంటే అతనికి అంత చిన్నచూపు!  కానీ,మరొక సూతపుత్రుడైన కర్ణుడు వీరుడని, తనకు భవిష్యత్తులో పనికొస్తాడని చేరదీశాడు.  “జన్మను బట్టి ఎవరినీ చిన్నచూపు చూడరాదని,పరాక్రమానికే పెద్ద పీట వేయాలని,” ఆ సందర్భంలో అందరికీ నీతులు కూడా గంభీరమైన ఉపన్యాసం దంచి మరీ చెప్పాడు.  దుర్యోధనుడి చేష్టలు, అతని బుద్ధి, తనతో అతనికి ఉన్న అవసరమూ కర్ణుడికి తెలియనివేమీ కావు.  తన కులానికే చెందినవాడిని దుర్యోధనుడు నిష్కారణంగా చంపాడని తెలిసినప్పటికీ, దుర్యోధనుడి ఆశ్రయం వలన తనకు కలిగే వైభవానికి ఆశపడి అతడు పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి పక్షాన్నే వహించాడు.  కర్ణుడి బుద్ధి అస్త్రవిద్యాప్రదర్శన సమయంలో అందరి ఎదుటా బయటపడింది.  అతడి  వ్యవహారాన్ని మొదటినుండి గమనిస్తూ ఉండిన భీముడు ర్ణుడిని “సూతపుత్రుడు” అంటూ వెక్కిరించాడు.  దాన్ని అందరూ పాండవులకు కర్ణుడు తక్కువజాతివాడని చిన్నచూపు చూశారు వివక్ష ప్రదర్శించారు అని విమర్శిస్తారు.  కానీ, పాండవులను ఆశ్రయించి బ్రతుకుతున్నాడు అనే కారణంగా దుర్యోధనుడు  నిరపరాధి అయిన ఒక సూతుడిని హత్య చేశాడు అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించరు.  
ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలంటే, మన కాలంలో జరుగుతున్న ఒక సంఘటనను ఉదాహరించవచ్చు.  తనవారైన కాపువారికి చంద్రబాబు ఎంత అన్యాయం చేస్తున్నప్పటికీ వారిని వారిని వారి కర్మకు వదిలి, ఆవిషయాన్ని ఎంతమాత్రమూ పట్టించుకోకుండా చంద్రబాబునే వెనకేసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కాలపు కర్ణుడు అన్నమాట.  కానీ, ఆనాటి దుర్యోధనుడు కర్ణుడిని తన జీవితాంతం మిత్రుడిగా ఆదరించాడు.  ఈనాటి దుర్యోధనుడు చంద్రబాబు మాత్రం ఈ కాలపు కర్ణుడిని తన అవసరం తీరగానే కరివేపాకులా వదిలించుకుంటాడన్నది జగమెరిగిన సత్యం.   ఆరోజుల్లో భీముడు కర్ణుడిని సూతపుత్రా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ను ఇపుడు కాపుపుత్రా అంటే (ఈ మాటను స్వయంగా కాపువారే అతనికి పదే పదే గుర్తు చేస్తున్నారు.)  అది వివక్షాపూరితమైన మాట అని ఎవరైనా అనగలరా?
అటువంటి వివక్ష ఉండరాదు అంటూ అందరూ మహా పోలికేకలు పెడుతున్నారు గాని, ఆ లెక్కన అసలు వివక్ష లేనిదెవరికి?  “Indians and dogs are not allowed inside” అని బ్రిటిషువారు కొన్ని ప్రదేశాలలో బోర్డులు వేలాడదీసేవారు అని అప్పుడప్పుడూ గుర్తొస్తే తెగ బాధపడతామే?  భారతీయులు మాత్రం తక్కువ తిన్నారా?  చండాలురు అని కొంతమందిని ఈసడించుకుంటూ వారిని దూరంగా అస్పృశ్యులుగా పెట్టిన రోజులు లేవా?   
హిట్లర్ వివక్షతో లక్షలాది యూదులను ఊచకోత కోయించాడంటారు.  అమెరికాలో తెల్లవారు కొన్ని శతాబ్దాలపాటు నీగ్రోలతోను పశువులతోను ఒకే విధంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికాలో కూడా కొన్ని దశాబ్దాల ముందటి వరకు ఇదే విధానం ఉండేది.  ఇలా చరిత్రలో వివక్షను గూర్చి రీసెర్చ్ చేయదలచుకుంటే ఎంతకాలం చేసినా తరగని విషయాలు  ఎన్నెన్నో ఉన్నాయి. 
సామాన్యమానవులమైన మనం మాత్రం ఏమైనా తీసిపోయామా?  ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, మనం కూడా వివక్షను మనదైన రీతిలో పాటిస్తున్నాము.  మార్కెట్టులో కూరగాయలను గీచి గీచి బేరమాడతాము.  రిలయన్స్  కు బిగ్ బజారుకు పోతే అక్కడ కూరగాయలకు ఎంత రేటు ఉంటే అంత రేటుకు  నోరుమూసుకుని కొనుక్కొస్తాము.  రోడ్డు పక్కన సరుకులు అమ్ముకొనేవారి పట్ల మనకుండే చిన్నచూపుకు అది నిదర్శనం కాదా?  
మనకు కారు ఉంటే కష్టపడి మోటార్ బైకును మైంటైన్ చేసే మరొక మనిషిని తక్కువగా చూస్తాము.  
గవర్నమెంటు సెక్టారులో పెర్మనెంటు జాబు చేసేవాడు టెంపొరరీ వాడిని చులకనగా చూస్తాడు.  
చివరకు టీవీ ప్రకటనల్లో కూడా నల్లగా ఉంటే మీకు ఉద్యోగం రాదు, మీకు బాయ్ ఫ్రెండ్ దొరకడు, కాబట్టి తెల్లబడండోయ్ అంటూ సమాజంలో మనం చూపుతున్న వివక్షను తేటతెల్లం చేస్తున్నారు.   కాబట్టి, "నేను సైతం వివక్షాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను!"  అనుకోవాలి మనం.
"మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి," - అంటూ “నేరం నాది కాదు ఆకలిది” అనే సినిమాలో ఒక పాట ఉంది.   "ఏ నేరం చేయని వాడు ముందుగా రాయి విసరాలి" అని కథానాయకుడు జనాలను సవాలు చేస్తే, ఆ జనాలు సిగ్గుపడి తమ చేతనున్న రాళ్లు వదిలి పెట్టినట్లు చూపించగలిగారంటే కారణం అది సినిమా కాబట్టి.  
అబ్బే, ఇటువంటి ట్రిక్కులు ఎవరో కొందరు సిగ్గూ శరమూ ఉన్నవాళ్ళ దగ్గర పనిచేస్తాయి కానీ, ముదిరిపోయిన రాజకీయ వాదుల దగ్గర పనిచేయవు.  పొరపాటున వారిని ఎవరైనా సవాలు చేస్తే ఆ చేసినవారిమీదనే వీరు ముందుగా రాళ్లు విసురుతారు.  
2014 నుండి గమనిస్తూనే ఉన్నాము కదా? అధికారపక్షంవారికి ప్రతిపక్షంవారంటే ఎంత చిన్నచూపో!  ఎవరైనా“అధికారపక్షం ఈ విధంగా తప్పు చేస్తోంది” అంటే చాలు – “మా నాయకుడు చేస్తున్న అభివృద్ధిని సహించలేకపోతున్నారు” - అంటూ అంతెత్తున ఎగిరి పడుతుంటారు.  “ముందు మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?” అంటూ ఎదురుదాడికి దిగుతారు.  అందరి ముందూ చర్చకు రావలసిన విషయాన్ని ఆవిధంగా అతి సౌకర్యంగా ప్రక్కదారి పట్టించి అనవసరమైన గొడవలను సృష్టించి ప్రజల దృష్టిని ఆలోచనలను మరోవైపు మళ్లించే కళలో వారు ఆరితేరిపోయారు.  
ఒకపక్క అటువంటి వారిని వెనకేసుకొని వస్తూ,  మరో పక్క ఉత్తరాది వారు దక్షిణాదివారిమీద వివక్ష చూపిస్తున్నారు అని ఆరోపణలు చేయడం ఉత్త  వెర్రిమొర్రి వాగుడు మాత్రమే!  
ప్రతిసమాజంలోనూ కొందరు వివక్ష కలిగినవారు ఎప్పుడూ ఉంటారు.  వారికి అధికారకాంక్ష ఉన్నట్లయితే మొదటగా మరికొందరిలో కూడా అటువంటి భావాలను నాటడానికి ప్రయత్నిస్తారు.  తరువాత, అటువంటి భావాలు కలిగినవారికి నాయకులుగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.   ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ను మనం చూడడం లేదా?  కాబట్టి,  ఆరకంగా మనం అతిగా భావావేశాలకు లోనుకాకుండా, మనలో ఉన్నదో లేదో కూడా తెలియని వివక్షను రెచ్చగొట్టి లేపేవారి పట్ల జాగ్రత్తగా ఉందాం.  
తస్మాత్ జాగ్రత జాగ్రత!  

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...