Tuesday 17 August 2021

జాగ్రత జాగ్రత - మేలుకొనండి - మేలుకొనండి

దేవనాగరి

माता नास्ति पिता नास्ति बन्धुः सहोदरः ।

अर्थं नास्ति गृहं नास्ति तस्मात् जाग्रत जाग्रत ॥1॥


जन्म दुःखं जरा दुःखं जाया दुःखं पुनः पुनः ।

संसारसागरं दुःखं तस्मात् जाग्रत जाग्रत ॥2॥


कामः क्रोधश्च लोभश्च देहे तिष्ठन्ति तस्कराः ।

ज्ञानरत्नापहाराय तस्मात् जाग्रत जाग्रत ॥3॥


आशया बध्यते लोकः कर्मणा बहुचिन्तया ।

आयुक्षीणं न जानाति तस्मात् जाग्रत जाग्रत ॥4॥


सम्पदः स्वप्नसङ्काशाः यौवनं कुसुमोपमम् ।

विद्युच्चञ्चलमायुष्यं तस्मात् जाग्रत जाग्रत ॥5॥


क्षणं वित्तं क्षणं चित्तं क्षणं जीवितमेव च ।

यमस्य करुणा नास्ति तस्मात् जाग्रत जाग्रत ॥6॥


अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः ।

नित्यं सन्निहितो मृत्युः तस्मात् जाग्रत जाग्रत॥7॥


తెలుగు

మాతా నాస్తి పితా నాస్తి బన్ధుః సహోదరః ।

అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥1॥


జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః ।

సంసారసాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత ॥2॥


కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః ।

జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత ॥3॥


ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచిన్తయా ।

ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥4॥


సమ్పదః స్వప్నసఙ్కాశాః యౌవనం కుసుమోపమమ్ ।

విద్యుచ్చఞ్చలమాయుష్యం తస్మాత్ జాగ్రత జాగ్రత ॥5॥


క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమేవ చ ।

యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥6॥


అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః ।

నిత్యం సన్నిహితో మృత్యుః తస్మాత్ జాగ్రత జాగ్రత॥7॥


కన్నడం

ಮಾತಾ ನಾಸ್ತಿ ಪಿತಾ ನಾಸ್ತಿ ಬನ್ಧುಃ ಸಹೋದರಃ ।

ಅರ್ಥಂ ನಾಸ್ತಿ ಗೃಹಂ ನಾಸ್ತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥1॥


ಜನ್ಮ ದುಃಖಂ ಜರಾ ದುಃಖಂ ಜಾಯಾ ದುಃಖಂ ಪುನಃ ಪುನಃ ।

ಸಂಸಾರಸಾಗರಂ ದುಃಖಂ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥2॥


ಕಾಮಃ ಕ್ರೋಧಶ್ಚ ಲೋಭಶ್ಚ ದೇಹೇ ತಿಷ್ಠನ್ತಿ ತಸ್ಕರಾಃ ।

ಜ್ಞಾನರತ್ನಾಪಹಾರಾಯ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥3॥


ಆಶಯಾ ಬಧ್ಯತೇ ಲೋಕಃ ಕರ್ಮಣಾ ಬಹುಚಿನ್ತಯಾ ।

ಆಯುಕ್ಷೀಣಂ ನ ಜಾನಾತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥4॥


ಸಮ್ಪದಃ ಸ್ವಪ್ನಸಙ್ಕಾಶಾಃ ಯೌವನಂ ಕುಸುಮೋಪಮಮ್ ।

ವಿದ್ಯುಚ್ಚಞ್ಚಲಮಾಯುಷ್ಯಂ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥5॥


ಕ್ಷಣಂ ವಿತ್ತಂ ಕ್ಷಣಂ ಚಿತ್ತಂ ಕ್ಷಣಂ ಜೀವಿತಮೇವ ಚ ।

ಯಮಸ್ಯ ಕರುಣಾ ನಾಸ್ತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥6॥


ಅನಿತ್ಯಾನಿ ಶರೀರಾಣಿ ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತಃ ।

ನಿತ್ಯಂ ಸನ್ನಿಹಿತೋ ಮೃತ್ಯುಃ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ॥7॥


తమిళం

மாதா நாஸ்தி பிதா நாஸ்தி பந்துஃ ஸஹோதரஃ ।

அர்தஂ நாஸ்தி க௃ஹஂ நாஸ்தி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥1॥


ஜந்ம துஃகஂ ஜரா துஃகஂ ஜாயா துஃகஂ புநஃ புநஃ ।

ஸஂஸாரஸாகரஂ துஃகஂ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥2॥


காமஃ க்ரோதஶ்ச லோபஶ்ச தேஹே திஷ்டந்தி தஸ்கராஃ ।

ஜ்ஞாநரத்நாபஹாராய தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥3॥


ஆஶயா பத்யதே லோகஃ கர்மணா பஹுசிந்தயா ।

ஆயுக்ஷீணஂ ந ஜாநாதி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥4॥


ஸம்பதஃ ஸ்வப்நஸங்காஶாஃ யௌவநஂ குஸுமோபமம் ।

வித்யுச்சஞ்சலமாயுஷ்யஂ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥5॥


க்ஷணஂ வித்தஂ க்ஷணஂ சித்தஂ க்ஷணஂ ஜீவிதமேவ ச ।

யமஸ்ய கருணா நாஸ்தி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥6॥


அநித்யாநி ஶரீராணி விபவோ நைவ ஶாஶ்வதஃ ।

நித்யஂ ஸந்நிஹிதோ ம௃த்யுஃ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத॥7॥


మళయాళం

മാതാ നാസ്തി പിതാ നാസ്തി ബന്ധുഃ സഹോദരഃ ।

അര്ഥം നാസ്തി ഗൃഹം നാസ്തി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥1॥


ജന്മ ദുഃഖം ജരാ ദുഃഖം ജായാ ദുഃഖം പുനഃ പുനഃ ।

സംസാരസാഗരം ദുഃഖം തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥2॥


കാമഃ ക്രോധശ്ച ലോഭശ്ച ദേഹേ തിഷ്ഠന്തി തസ്കരാഃ ।

ജ്ഞാനരത്നാപഹാരായ തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥3॥


ആശയാ ബധ്യതേ ലോകഃ കര്മണാ ബഹുചിന്തയാ ।

ആയുക്ഷീണം ന ജാനാതി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥4॥


സമ്പദഃ സ്വപ്നസങ്കാശാഃ യൌവനം കുസുമോപമമ് ।

വിദ്യുച്ചഞ്ചലമായുഷ്യം തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥5॥


ക്ഷണം വിത്തം ക്ഷണം ചിത്തം ക്ഷണം ജീവിതമേവ ച ।

യമസ്യ കരുണാ നാസ്തി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥6॥


അനിത്യാനി ശരീരാണി വിഭവോ നൈവ ശാശ്വതഃ ।

നിത്യം സന്നിഹിതോ മൃത്യുഃ തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത॥7॥

Saturday 14 August 2021

యుద్ధం ఎందుకు చేయాలి?




ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి. ప్రతి రాజ్యానికి అధిపతిగా ఒక రాజు ఉండేవాడు. సాధారణంగా రాజ్యాలమధ్య సఖ్యత ఉండేది. అయితే అప్పుడప్పుడు ఆయా రాజుల నడుమ కలహాలు సంభవించేవి. అందుకు ఎన్నో కారణాలు.

రాజ్యస్త్రీస్థానదేశానాం జ్ఞానస్య చ బలస్య చ।
అపహారో మదో మానః పీడా వైషయికీ తథా।।

జ్ఞానార్థశక్తిధర్మాణాం విఘాతో దైవమేవ చ।
మిత్రార్థం చావమానశ్చ తథా బంధువినాశనమ్।।

అంటూ కౌటిల్యశిష్యుడైన కామందకుడు యుద్ధాలకు కారణాలను పేర్కొన్నాడు.

1) రాజ్యరక్షార్థమ్ -
(అంటే అధికారరక్షణం కోసం యుద్ధం)

2) స్త్రీరక్షార్థమ్ -
(సీతమ్మ కోసం రావణాసురుడితో రాముడు చేసిన యుద్ధం - స్వయంవరంలో ద్రౌపది క్షత్రియేతరుని వరించిందనే అక్కసుతో దుర్యోధనాదులు చేసిన ఆగడం, కృష్ణుడు రుక్మిణికోసం చేసిన యుద్ధం - ఆధునిక చరిత్రలో చితోర్ రాణి పద్మిని ఆత్మగౌరవం కాపాడడం కోసం జరిగిన యుద్ధం మొదలైనవి ఉదాహరణలు)

3) స్థానరక్షార్థమ్
(అంటే రాజధానిరక్షణకోసం యుద్ధం)

4) విషయపీడాప్రతికారః -
(దేశానికి చెందిన ప్రజలను, శత్రువులు పీడిస్తుంటే వారిని రక్షించుకొనడం కోసం యుద్ధం)

5) దేశరక్షార్థమ్ -
(దేశానికి చెందిన భూభాగాన్ని రక్షించుకొనడం కోసం యుద్ధం)

6) జ్ఞానరక్షార్థమ్ -
(విద్యాలయాలపై, గురువులపై, విద్యార్థులపై దాడి జరిగినపుడు యుద్ధం - మారీచసుబాహులతో రాముని యుద్ధం)

7) బలరక్షార్థమ్ -
(సైన్యంపై దాడి జరిగినపుడు ప్రతికారం తీర్చుకోవాలి - పుల్వామా వంటి ఘటనలు జరిగినపుడు)

8) మదః -
ఆయా రాజుల పొగరు కారణంగా వైరం ఏర్పడుతుంది. ద్రుపదుడు తన పొగరు కొద్దీ ద్రోణాచార్యునితో వైరం పెంచుకున్నాడు. వారి వైరం వారి సంతానానికి కూడా అంటుకుంది. యుద్ధంలో ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు మర్యాదను అతిక్రమించి ద్రోణాచార్యులవారి శిరస్సును ఖండించాడు. ఆ ధృష్టద్యుమ్నుని ద్రోణపుత్రుడైన అశ్వత్థామ హతమార్చాడు.

9) మానః -
తనకు చాలని ఆత్మాభిమానం కారణంగా వైరం ఏర్పడుతుంది. లేదా శక్తిమంతుల ఆత్మాభిమానాన్ని నిష్కారణంగా దెబ్బ కొట్టినా వైరం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు తనను పరాజితుడిని చేసి తన చెల్లెలైన రుక్మిణిని వివాహం చేసుకున్నందుకు రుక్మి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. మనస్సులో ఏవిధంగానైనా యాదవులను అవమానించాలనే కక్ష గూడు కట్టుకుంది. ఒకసారి బలరాముడితో జూదం ఆడుతూ బలరాముడు గెలిచినప్పటికీ ఓడిపోయాడని వెక్కిరించాడు. కాదు నేనే గెలిచానని బలరాముడంటే నువ్వు అబద్ధాలాడుతున్నావని ఆరోపించాడు. బలరాముడు మండిపడి ఒకే ఒక్క పిడికిలిపోటుతో రుక్మిని యమలోకానికి పంపించేశాడు. అలాగే రాజసూయయాగసభలో శ్రీకృష్ణునికి పాండవులు చేసిన అగ్రపూజను సహించలేక వాచాలత కొద్దీ అందరినీ నిందిస్తూ శ్రీకృష్ణుని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శిశుపాలుడు శిరశ్ఛేదం చేయించుకున్నాడు.

10) అర్థరక్షార్థమ్ -
(దేశానికి ఆదాయాన్ని తెచ్చే వనరులపై ఆక్రమణ జరిగినపుడు వాటిని కాపాడుకొనడం కోసం యుద్ధం)

11 ) ధర్మరక్షార్థమ్ -
(ధర్మాన్ని కాపాడటం కోసం - ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అది ధర్మజీవనం. కాని, ఇతరులను నిష్కారణంగా పీడించటం, తాము చెప్పినట్టే ప్రజలందరూ నడచుకోవాలి అనటం అధర్మం. ఆవిధంగా లోకానికి భౌతికంగా కాని, మానసికంగా కాని, నైతికంగా క్షోభ కలిగించే వారిని అణచడం కోసం జరిగే యుద్ధం - ఉదాహరణ కురుక్షేత్రయుద్ధం)

12) దైవమ్ -
(అపార్థాల వలన, శకునివంటి పైశున్యకారులవలన విరోధం చెలరేగి యుద్ధం జరుగవచ్చు)

13) మిత్రార్థమ్ -
(ఆప్తమిత్రులను రక్షించడం కోసం, వారి ప్రయోజనాలను కాపాడటం కోసం యుద్ధం - సుగ్రీవుని కోసం రాముడు, రాముని కోసం సుగ్రీవుడు చేసిన యుద్ధాలు)

14) అవమానప్రతికారః -
(రాజుకుగాని, దేశానికి గాని అవమానం లేదా ఆపద కలిగినపుడు యుద్ధం చేయవచ్చు - తమ దేశంలో ట్విన్ టవర్లపై జరిగిన దాడికి ప్రతికారంగా అమెరికా ఒబామాను హతమార్చింది కదా, అటువంటి యుద్ధం)

15) బంధువినాశప్రతికారః -
(ఆత్మీయబంధువులను నాశనం చేసిన వారిపై యుద్ధం - రాత్రివేళ నిద్రిస్తున్న తమ కుమారులను హతమార్చిన అశ్వత్థామను వెంటాడి పట్టుకున్న భీమార్జునులు ఉదాహరణార్హులు)

ఈ విధంగా యుద్ధం చేయటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మన దేశానికి ఇరుగు పొరుగు అనదగిన ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధసంక్షోభం జరుగుతోంది. తాలిబన్లకు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నడుమ రాజ్యంకోసం యుద్ధం నడుస్తోంది.
ఇక్కడ రాజ్యమంటే భూభాగం కాదు. రాజ్యమంటే ఒక దేశపు భూభాగం పై అధికారం అని మాత్రమే అర్థం. ఒక దేశపు రాజ్యాంగానికి (!) విరుద్ధంగా లేదా ఆ దేశప్రజలకు అభ్యంతరకరమైన రీతిలో ఆ దేశప్రజలపై పెత్తనం చేసే అధికారాన్ని ఎవరైనా బలాత్కారపూర్వకంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తే వారితో విరోధం కలుగుతుంది. అందువల్ల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థానంలో జరుగుతున్నది అదే. తాలిబన్లు బలాత్కారపూర్వకంగా ఆఫ్ఘనిస్థాన్లో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రతిఘటిస్తోంది.

ఇది ఇలా ఉండగా, భారతప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోవాలి - అక్కడి సంక్షోభాన్ని సరిజేయాలి అని కొందరు మిత్రులు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు అది తనకు మాలిన ధర్మం - అది మనకు అనవసరమైన విషయం అంటున్నారు.

పైన పేర్కొన్నవాటిలో మనం (భారతదేశం) ఆఫ్ఘనిస్థాన్ క్షేత్రంలో
(ప్రస్తుతం) యుద్ధం చేసేందుకు తగిన కారణాలు ఒకటి రెండు ఉన్న మాట నిజమే.

1 అది మన రాజ్యం కాదు - (ఒకప్పుడు మన రాజ్యం అనే సెంటిమెంటు వద్దు). అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

2 తాలిబన్లు తాము ఆక్రమించిన ఆఫ్ఘన్ భూభాగంలోని స్త్రీలపై దుర్భరమైన అత్యాచారాలు చేస్తున్న మాట నిజమే. ధర్మానికి కట్టుబడి ఆ స్త్రీలను రక్షించవలసిన బాధ్యత మనకున్నది.

3) కాబూల్ మన రాజధాని కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

4) ఆఫ్ఘన్లో ఉన్నది మన దేశపు ప్రజలు కారు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కాని వారు శరణుకోరితే వారిని రక్షించవలసిన బాధ్యత మనకుంటుంది.

5) ఆఫ్ఘన్ ప్రస్తుతం మన భూభాగం కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

6) మన విద్యాలయాలవంటివి ఆఫ్ఘన్లో లేవు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

7) మన సైన్యంపై తాలిబన్లు దాడి జరపలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

8) తాలిబన్లు తమ పొగరుకొద్దీ మనకు అపకారం చేస్తే దండించవలసిందే. కాని వ్యవహారం అంతదూరం రాలేదు.

9) తాలిబన్ల ఆత్మాభిమానాన్ని మనం గాని, మన ఆత్మాభిమానాన్ని వారుగాని దెబ్బతీయడం జరగలేదు అందువల్ల మనకూ వారికీ ఈ విషయంలో వైరం లేదు.

10) మన ఆదాయవనరులకు తాలిబన్లవల్ల నష్టం కలుగలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

11) ధర్మమంటే కొందరు మతం అని భావిస్తుంటారు. అలాగైతే ఆఫ్ఘన్లో తాలిబన్లవలన చిత్రహింసలకు గురి అవుతున్నది ఇస్లాం మతస్థులే. కాని, భారతదేశంలోని ఇస్లాం మతస్థులు ఆ విషయమై తమ కలవరాన్ని వ్యక్తపరచటం లేదు. అందువలన మనం తగుదునమ్మా అని యుద్ధానికి పోవడం సమంజసం కాదు. అలా కాదు, ధర్మమంటే మతాతీతమైన మానవనీతి అని భావించినపక్షంలో మనకు ఆ ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఉన్నది.

12) దైవమ్ అనేది మన చేతిలో లేని విషయం. దైవికంగా యుద్ధం సంభవిస్తే పోరాటం చేయవలసిందే.

13) ప్రస్తుతకాలపు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మనకు మిత్రుడే. కాబట్టి వారిని రక్షించవలసిన బాధ్యత మనపై ఉంది.

14) తాలిబన్లు భారతదేశాన్ని తమ చేష్టలతో అవమానిస్తే చేష్టలతోనే ప్రతికారం చేయాలి. తమ మాటలతో అవమానిస్తే మాటలతోనే ప్రతికారం చేయాలి.

15) తాలిబన్లు ఆఫ్ఘన్లో పని చేస్తున్న భారతపౌరులను హతమార్చడం వంటి పనులను చేస్తే ప్రతికారంగా యుద్ధం చేయవచ్చు.

ఈ విధంగా మనం తాలిబన్లతో యుద్ధం చేయడానికి తగిన కారణాలు కొన్ని ఉన్నాయి. కాని, చాల కారణాల వలన మనం వారితో యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

"ప్రయోజనమనుద్దిశ్య న మందోఽపి ప్రవర్తతే" అని అందరూ అంగీకరించే మాట.

ఏదో ఒక ప్రయోజనం లేదా ఏదో ఒక లాభం లేకపోతే ఒక మూర్ఖుడు గాని చివరకు ఒక సోమరిపోతు గాని ఏ పనీ చేయడు.

మరి ఇక తెలివైనవారి సంగతి వేరే చెప్పాలా? ఎన్నెన్నో బాధ్యతలు కలిగినవారు నిష్కారణంగా యుద్ధం వంటి అతి పెద్ద సమస్యలను చేతులారా నెత్తికెత్తుకుంటారా?

"భూమిర్మిత్రం హిరణ్యం చ విగ్రహస్య ఫలం త్రయమ్"

యుద్ధం వలన మూడు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అంటూ కామందకుడు వాటిని పేర్కొన్నాడు.

1) శత్రుభూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం
2) వేరొకదేశంతో మన మైత్రీసంబంధాన్ని దృఢం చేసుకొనడం
3) ధనలాభం

ఈ మూడింటిలో ఏ ఒక్కదానినీ ఆశించకుండా యుద్ధం చేయడం వృథా అని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం.

పైగా యుద్ధం అనేది ఒకరోజుతోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ముగిసేది కాదు. దాని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా దేశప్రజలందరిపైనా సుదీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి యుద్ధాన్ని మనంతట మనంగా (స్వయంగా) అనాలోచితంగా నిష్కారణంగా మొదలు పెట్టరాదు.

కాని, ఇతరులు మనపై యుద్ధాన్ని ప్రకటిస్తే మాత్రం ఆత్మరక్షణకోసం భీకరమైన యుద్ధానికి సిద్ధం కావలసిందే. ఎందుకంటే అది జీవన్మరణసమస్య.

ఇంకా, కాని ఎంతటి పరాక్రమవంతుడైనా యుద్ధాన్ని ఒంటరిగా చేయరాదు. అభిమన్యుడు అసహాయశూరుడై చేసిన అసామాన్యయుద్ధపు ఫలితం తెలిసిందే కదా? కాబట్టి, యుద్ధం చ బహుభిస్సహ అన్నారు. యుద్ధమనేది మిత్రులందరినీ కలుపుకుని చేయవలసిన పని.

అందువల్ల ఆఫ్ఘన్ ప్రజలను రక్షించాలనుకుంటే ప్రపంచంలోని ఇతరదేశాలను కలుపుకుని క్రమంగా సామభేదదానదండోపాయాలను ప్రయోగించి తాలిబన్లను వారి మిత్రులను కూడా దారికి తీసుకురావాలి. లొంగదీసుకోవాలి. ఆ రెండూ కూడా సాధ్యం కాకుంటే వారిని సమూలంగా నాశనం చేయాలి. దానికి చాల కాలం పట్టవచ్చు. కాని, ఫలితం ముఖ్యం. ఆ ఫలితమే ప్రపంచానికంతటికీ చిరసుఖకారి.

ఇతి శమ్.



భారతస్వాధీనతాదినోత్సవసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు



 



Saturday 7 August 2021

"తమ్ముడి కంటె అన్నే నయం!"


 

"తమ్ముడి కంటె అన్నే నయం!" అన్నారు ఊరందరూ. అది విని తమ్ముడు గర్వంతో మీసం మెలేశాడు.

ఆ అన్నదమ్ములను ఊరిలో అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అన్యోన్యత ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోండ్రా అంటూ ఊరిలో తగవులాడే కుర్రకారుకు బోధనలు చేస్తూ ఉంటారు.

అయితే వారి పొరుగింటాయనకు వారంటే గిట్టేది కాదు.
"ఏం, వీరు తప్ప ప్రపంచంలో వేరే అన్నదమ్ములంటూ ఎవరూ లేరా? వీరిలో పెద్ద ప్రత్యేకత ఏముంది?" అని అసూయతో గింజుకు చచ్చేవాడు.

వారి మధ్య ఎప్పటికైనా గొడవ రాకపోతుందా నేను చూసి ఆనందించకపోతానా అని ఎదురు చూసేవాడు. వారి మధ్యలో గొడవలు రావాలని వారంలో ప్రతి మొదటి రోజూ ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవెనలు పొందేవాడు. వారంలో ప్రతి ఆరో రోజూ వంగి వంగి దండాలు పెట్టేవాడు.

మొత్తానికి అతగాడి ప్రార్థనలు ఫలించాయో ఏమో,
ఆ అన్నదమ్ములిద్దరికీ గొడవ వచ్చింది. అన్న తన యజమానిని విమర్శించినందుకు తమ్ముడికి కోపం వచ్చింది. ఆ విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇద్దరూ ఆ యజమాని విషయం విస్మరించి ఒకరినొకరు తిట్టుకున్నారు. విడిపోయి వేరే వేరే ఇండ్లలో కాపురం పెట్టారు.

ఆ పొరుగింటాయన సంతోషానికి మేర లేదు.
కాని మళ్లీ కాస్త సందేహం కూడా వచ్చింది. గొడవలు తాత్కాలికమేమో. వీళ్లు మళ్లీ కలసిపోతే? ఆ సందేహం రాగానే వీల్లేదు, వీళ్లెప్పటికీ కలవడానికి వీల్లేదు, మళ్లీ కలవకుండా ఒకరికి తెలియకుండా మరొకరి పట్ల సానుభూతిని కనబరుస్తూ, వారిని రహస్యంగా రెచ్చగొట్టి, ఇద్దరికీ మధ్యన ఉండే సంబంధాన్ని శాశ్వతంగా తెంచేయాలి అనుకున్నాడు.

నెమ్మదిగా అన్న ఇంటికి పోయాడు.
"అన్నా, అన్నా, ఎంతటి ఘోరమన్నా, ధర్మరాజులాంటి తమరిని మీ తమ్ముడు ఎంతేసి మాటలన్నాడన్నా? అసలు వాడికి బుద్ధి లేదన్నా, ఊర్లో వాడంతటి కృతఘ్నుడు లేడన్నా" అంటూ మొదలు పెట్టాడు. తన మాటలతో అన్నకు సంతోషం కలుగుతుందనుకున్నాడు పాపం.

కాని, అతడి మాటలకు అన్నకు వొళ్లు మండింది.
"నోర్ముయ్యరా గాడిదా" అని తిట్టాడు. "నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసును. నువ్వెవడ్రా మధ్యలో నా తమ్ముడి గూర్చి నోరెత్తడానికి, మళ్లీ ఇలాంటి కూతలు ఇంకెక్కడైనా కూశావని తెలిసిందో?" అంటూ చేయి చాపి అటువైపు చూడమని సైగ చేశాడు.

పొరుగింటాయన అటువైపు చూశాడు. అక్కడ కొత్త చెప్పుల జంట, నవనవలాడుతూ కనిపించింది.

"చూశావు కదా, వాటితో కొడతాను. నోర్మూసుకుని పోరా ఇక్కడ్నుంచి" అని అన్న ఈసడించుకున్నాడు.

పొరుగింటాయన గప్పుచుప్పున లేచి వెళ్లిపోయాడు.

ఆ వెళ్లినవాడు ఊరికినే పోలేదు.
"ఉరేయ్ అన్నా, భడవా, నీ పని పడతాను చూడరా, నీ తమ్ముడిని నీ మీదకు ఉసిగొలిపి మీరిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఊరందరిలోను మీ ఇద్దరి పరువు తీస్తాను చూడండ్రా" అని మనసులో శపథాలు చేసుకుంటూ మరీ వెళ్లాడు.

తరువాత తమ్ముడి ఇంటికి వెళ్లాడు.
"తమ్ముడూ తమ్ముడూ, మీ అన్న ఎంతటి మూర్ఖమైన పని చేశాడురా, అలనాడు లక్ష్మణుడు రాముని సేవించినదాని కన్న, నీవు మరింత ఎక్కువగానే మీ అన్న దగ్గర మసలుకున్నావు. కాని, మీ అన్న మాత్రం రావణాసురుడు విభీషణున్ని గెంటేసినట్టు నిన్ను నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. వాడంతటి మూర్ఖుడు క్రూరుడు ఈ లోకంలో ఇంకెవడైైనా ఉంటాడాా? అసలు..." అంటూ ధారాప్రవాహంగా మాటాడుతూ ఉండగా...

ఆ పొరుగింటాయనకు చెంపమీద ఏమిటో కాలినట్లనిపించింది. చెంప తడుముకున్నాడు. ఈ లోపుల మరో చెంప కూడా కాలింది. ఆ చెంప తడుముకున్నాడు. రెండు చేతుల మండలూ కాలడం మొదలు పెట్టాయి.

"ఏమిటిది, ఏమి జరుగుతోంది?" అని అతడు తలెత్తి ఆలోచించేలోపలే ఆ తమ్ముడు రౌద్రాకారం ధరించి తనను కొత్త చెప్పుల జతతో ఎడా పెడా వాయిస్తున్నట్టు తెలిసింది. ఆ వాయింపుడు ఎలా ఉందంటే తగిలిన చోటల్లా నిప్పు కొరివి పెట్టి గుచ్చినట్లు కాలిపోతోంది. తాను చేయి అడ్డు పెట్టినప్పుడు చేతులు కూాడా మండిపోయేంత కసిగా కొడుతున్నాడు ఆ తమ్ముడు.

"ఏరా దున్నపోతా, ఏరా కుక్కా, మా అన్నను గూర్చి మాటలు తూలేంతటి మొగోడైనావేమిరా నువ్వు?" అంటూ మొదలైన తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ పొరుగింటాయన పారిపోతుంటే వెంటబడి మరీ కొడుతున్నాడు ఆ తమ్ముడు. ఊరందరూ అతడికి జరిగిన సన్మానం చూశారు. జరిగిన విషయమేమిటో నెమ్మదిగా ఊరందరికీ తెలిసిపోయింది. పగలబడి నవ్వుకున్నారు.

"తమ్ముడి కంటె అన్నే నయం!" అన్నారు ఊరందరూ. అది విని తమ్ముడు గర్వంతో మీసం మెలేశాడు.

(మా చిన్నప్పుడు మా అవ్వాతాతోళ్లు చెబుతూ ఉండిన కథ ఇది. నేటి పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా మార్చి వ్రాశాను.)


Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3276036629183661

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...