Showing posts with label Rama. Show all posts
Showing posts with label Rama. Show all posts

Friday, 20 March 2020

సుగ్రీవుడు తెచ్చిన న్యూస్ పేపర్లు




అనగా అనగా రావణాసురుడు.

బ్రహ్మనుగూర్చి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోవయ్యా అంటే - దేవ, దానవ, గంధర్వ, యక్ష, రక్షః, సుర, అసుర, కిన్నర, కింపురుష, నాగ, పశు, పక్ష్యాదులు - వీరిలో నేను ఎవరిచేతిలోనూ చావకూడదు అని ఒక స్వతంత్రబలప్రతిపత్తిని కోరుకున్నాడు.

సరే, నీ చావు నువ్వే చావు అని బ్రహ్మ అతడు కోరుకున్న స్వతంత్రబలప్రతిపత్తిని వరంగా ఇచ్చేశాడు.

అపుడు అతడి పక్కన అతడి మేనమామ ప్రహస్తుడు చేరి స్వతంత్రబలప్రతిపత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఆ సలహాను అనుసరించి, రావణాసురుడు లంకనుండి తన సోదరుడైన కుబేరుడిని అతని అనుచరులను తరిమి వేశాడు. లంక నాకు ఎలాగో నీకు కూడా అలాగే, మనం అందరమూ కలసి లంకలో హాయిగా జీవిద్దాం అని కుబేరుడు నచ్చజెప్పినా కూడా వినలేదు. తరిమేశాడు. వెళ్ళని వారిని చంపేశాడు.

ఆ తరువాత రావణాసురుడు తన మేనమామ అదుపు తప్పిపోయాడు.  కాని ఆ మేనమామ ఊహించిన దానికంటె ఎక్కువగా విజృంభించి అందరినీ చావగొట్టటం మొదలుపెట్టాడు. బ్రహ్మ అతడికి స్వతంత్రబలప్రతిపత్తిని ఇచ్చాడు అని అందరూ అతడిని ఏమీ చేయలేక ఊరుకున్నారు.

రావణాసురుడి దురాగతాలు మరీ ఎక్కువ అయ్యాయి. రాజకన్యలను ఎత్తుకొచ్చాడు. ఋషికన్యలను ఎత్తుకొచ్చాడు. గంధర్వ కన్యలను ఎత్తుకొచ్చాడు. దేవకన్యలను ఎత్తుకొచ్చాడు. నాగకన్యలను ఎత్తుకొచ్చాడు. యక్షకన్యలను ఎత్తుకొచ్చాడు. ఇలా కంటికి అందంగా కనిపించిన ప్రతివారినీ ఎత్తుకొచ్చాడు.

బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తి ప్రభావంతో అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. లంకలో జనాలకు ఇది చాల గొప్ప విషయంలా అనిపించింది. అలా చేయడం లంకారాజ్యానికి ఒక హక్కు అని వారికి అనిపించే స్థాయికి వారిని రావణుడు తీసుకుపోయాడు. అలా చేయడం తప్పు అని చెప్పే విభీషణుడు లాంటి వారు ఉన్నా, వారి గొంతు వినబడకుండా నొక్కేశారు.

ఒకసారి రావణాసురుడు రాముని భార్య అయిన సీతను గూర్చి విన్నాడు. తన స్వతంత్రబలప్రతిపత్తి విషయం రాముడికి కూడా తెలిసే ఉంటుంది, నన్ను ఏమీ చేయలేడు అనుకుని, సీతమ్మను కూడా ఎత్తుకొచ్చేశాడు. సీతమ్మ "ఉరే ఇది తప్పురా వెధవా, రాముడికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడురా" అన్నది.

"ఓ సీతా, రాజ్యం పోగొట్టుకున్న రాముడి గూర్చి ఇంకా ఆలోచన ఎందుకు? ప్రపంచంలోకెల్లా అందమైన నా లంకలో ప్రపంచంలోకెల్లా ఐశ్వర్యవంతుడనైన నా అండన నీవు బ్రతుకు" అన్నాడు రావణుడు. అసలు నిన్ను ఎత్తుకురావడం రాక్షసధర్మం. నా జన్మహక్కు పొమ్మన్నాడు.

అప్పుడు కూడా లంకాజనాలు రావణాసురుడు చేసిన పనిని మెచ్చుకున్నారు. లంక పరువునిలబెట్టాడు అని జేజేలు కొట్టే స్థాయిలో ఉన్నారు.

ఇంతలో రాముడికి సీత ఎక్కడ ఉందో తెలిసింది. దండెత్తి వచ్చాడు. లంకలో జనాలు గగ్గోలు పెట్టారు. రాముడు అలా రావడానికి వీల్లేదు అన్నారు.

మరి సీతను ఎందుకు ఎత్తుకొచ్చాడు రావణుడు? అని అడిగితే -

మరి హనుమంతుడు వచ్చి మా లంకను తగలబెట్టచ్చా? అని ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.

రాముడు లంకకు వంతెన కట్టడం తప్పని, అలా కడితే బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి భంగం కలిగించినట్టే అని వాదించడం మొదలు పెట్టారు.

"హనుమంతుడు వచ్చి అశోకవనం ధ్వంసం చేశాడు. అది తప్పు" అన్నారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు దాన్ని విడిపించుకుపోయి బ్రహ్మకు అవమానం చేశాడు, ఆ విధంగా లంక ప్రజల మనోభావాలను గాయపరిచాడు" అన్నారు.

ఈ లోపల లంక బయట ఉన్న రాక్షససమర్థకులు కొందరు నోరు విప్పి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

రాముడు శూర్పణఖ ముక్కు కోయడం తప్పు అన్నారు. ఖరదూషణులను చంపడం తప్పు అన్నారు. అసలు రాముడు దండకారణ్యానికి రావడమే పెద్ద తప్పు అన్నారు.

రాముడు తాటకను చంపడం తప్పు అన్నారు. రాముడు బంగారు లేడిని చంపడం తప్పు అన్నారు. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు రావడం తప్పున్నర తప్పు, అలా చేయడం లంక ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు.

ఈవిధంగా రాముడు ఇన్ని తప్పులు చేయడం వల్లనే రాక్షసులు మరింత మరింతగా రెచ్చిపోయారు అని, ఈవిధంగా రాముడి వల్లనే మనుషులకు రాక్షసులకు మధ్యలో సత్సంబంధాలు అన్నీ బెడిసి కొట్టాయని అన్నారు.

అందువల్ల, మనుషులకు రాక్షసులకు మరలా మంచి సంబంధాలను నెలకొల్పే సత్సంకల్పంతోనే రావణుడు సీతను ఎత్తుకు రావలసి వచ్చింది అని, అందులో తప్పేమీ లేదని వాదించడం మొదలుపెట్టారు.

రావణాసురుడు ఎత్తుకొచ్చింది ఒక్క సీతనే కాదు కదా?  అంతకు ముందు కూడా చాలా మంది స్త్రీలనే ఎత్తుకు వచ్చాడు కదా, మరి ఆ స్త్రీలకు సంబంధించిన వారందరూ నిశ్శబ్దంగా ఊరికినే ఉండగా ఒక్క రాముడే ఎందుకు దండెత్తి వచ్చాడు?  ఊరుకున్న వాళ్లందరికీ న్యాయం తెలియదా?  ధర్మం తెలియదా? నఈ రాముడు మాత్రమే పెద్ద న్యాయం ధర్మం తెలిసిన పోటుగాడా? అని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.

బ్రహ్మ గారు రావణాసురుడికి ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తిని భంగం చేయడానికి వీల్లేదు అని, అసలు రాముడిని సృష్టించినది కూడా బ్రహ్మేనని, సకలలోకాలనూ సృష్టించిన ఆ బ్రహ్మగారికంటే నిన్న గాక మొన్న పుట్టిన రాముడికి ఎక్కువ తెలుసా? అని ఏకి పారేయడం మొదలు పెట్టారు.

ఏ పరిస్థితులలో బ్రహ్మ అటువంటి ప్రతిపత్తిని రావణాసురుడికి ఇచ్చాడో కూడా తెలుసుకోలేక రాముడు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు.

లంక చుట్టూ తన సైన్యాన్ని నిలిపి, లంకానగరం మీద బాణాలు ఎక్కుపెట్టి, సీతను తిరిగి ఇమ్మని అడగడం ఏరకం ప్రజాస్వామ్యమని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధంగా రాముడు దౌర్జన్యం చేస్తే, లంకకు ఒక రావణాసురుడు కాదు, ఇంటింటా ఒక రావణాసురుడు వెలుస్తాడు జాగ్రత్త అన్నారు.  ఆ రావణాసురుల పుట్టుకకు రాముడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదంతా రాక్షసజాతి మీద రాముడు నిష్కారణంగా పగబట్టి చేస్తున్న దౌర్జన్యమే తప్ప మరొకటి కాదన్నారు.

రాముడికి రాజ్యవ్యామోహం ఎక్కువని, అందువల్లనే వాలిని చంపాడని ఆరోపించారు. మూర్ఖులైన వానరులు దాన్ని అర్థం చేసుకోలేక అతడిని ఫాలో అవుతున్నారని అన్నారు. రాముడితో చేతులు కలిపి వాలికి ద్రోహం చేసిన సుగ్రీవుడు, చివరకు తాను కూడా అదే గతిని పొందుతాడని అన్నారు.

రాముడిని దగ్గరగా చూసిన కైకేయికి రాముడి స్వభావం బాగానే తెలుసునని, అందువల్లనే అడవికి పంపించేసిందని అన్నారు. ఒక ఆడది గెంటించి వేస్తే దిక్కులేక అడవిలో పడ్డ రాముడు, లంక జోలికి పోతే రాక్షసులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

భరతుడు వచ్చి బ్రతిమాలినా రాముడు అయోధ్యకు వెనుతిరిగి పోకుండా ఉండటం రాక్షసులను రెచ్చగొట్టడం కోసమే తప్ప వేరు కాదన్నారు. నిజానికి అది దశరథుడి కొడుకులందరూ కలిసి ఆడిన నాటకమన్నారు.

విభీషణుడు లంకాద్రోహి అని, అతడివల్ల లంక సర్వనాశనం అవుతుందని, యుద్ధం ముగిసిన తరువాత రాముడు విభీషణుడిని, సుగ్రీవుడిని కూడా చంపేసి, ఇద్దరి రాజ్యాన్ని తానే ఆక్రమిస్తాడని, అయితే అప్పటికి తమకు జరిగిన మోసం తెలుసుకొనేందుకు రాక్షసులు, వానరులు ఎవరూ మిగిలి ఉండరని జోస్యాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలా నానా శాపనార్థాలు పెట్టారు.

బ్రహ్మగారు ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి వీరందరూ వ్యతిరేకులని, రాక్షసజాతి ఔన్నత్యాన్ని తట్టుకోలేక అందరూ ఇలా కుమ్మక్కు అయి, లంక మీదకు దండెత్తి వచ్చారని అన్నారు.

ఆయా న్యూస్ పేపర్లలో పడిన ఈ వార్తలను సుగ్రీవుడు తీసుకొచ్చి రాముడికి చూపించాడు. అన్నీ చదివిన రాముడు చిన్న చిరునవ్వు నవ్వి, వాటిని పక్కన పడేసి, సుగ్రీవా, నువ్వు టైం ట్రావెల్ చేసి, రెండు యుగాలు ముందుకు పోయి ఈ పేపర్లు పట్టుకొచ్చినట్టున్నావు. అప్పుడు ఎంత ధర్మమైన విషయానికి కూడా కొందరు ఆలోచనాశూన్యులు, కార్యశూన్యులు ఇలాగే గొడవలు చేస్తారు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. లెట్స్’ డూ వాట్ వీ హావ్ టు డూ’ అన్నాడు.

తరువాత జరగాల్సిందేదో జరిగింది. ఏమి జరిగిందో అందరికీ తెలుసు. సుగ్రీవుడు, విభీషణుడు, రాముడు హాయిగా ధర్మబద్ధంగా ఎవరి రాజ్యాలువాళ్లు పరిపాలించుకున్నారని ఎవరికి తెలియదో వారు చేతులు ఎత్తవచ్చు. లంక మాత్రం స్వతంత్రబలప్రతిపత్తి పీడను వదిలించుకుని స్వేచ్చగా బ్రతికింది.

Friday, 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

Friday, 5 April 2019

వికారి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు.
వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.
వికారి అనే పేరు విని
ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.
అదేమీ చెడ్డ పేరు కానే కాదు.
ధనము కలిగినవాడు ధని.
బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)
చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)
శూలము కలిగిన వాడు శూలి (శివుడు)
హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)
అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.
మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?
కాదు.
ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.
అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.
వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు. కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.
దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు. “మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.
అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.
ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు అన్నారు కదా?
ఆ వికృతులు ఏమిటో తెలుసా?
అందులో మొట్టమొదటిది మనస్సు.
తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,
కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,
భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.
(1+5+5+5=16)
అర్థమైందా?
ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి. అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.
సరే, ఇంతకీ మనం ఎవరం?
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.
"నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”
శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.
“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –
యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)
కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.
ఆ వస్తువులన్నీ వికారాలు.
వాటికి ఆ మట్టి మూలపదార్థం.
ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)
అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.
వాటికి బంగారం మూలపదార్థం.
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి. లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది. అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.
అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)
మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.
చైతన్యస్వరూపులం.
(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.
ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.
నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా? కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?
అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?
నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను. నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.
మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము. ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది. మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.
అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.
వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.
వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.
"ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?" అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పింది. అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.
మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?
భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.
జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. "మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?" అని వారు అడిగారట.
కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, - ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.
ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే. పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.
దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?)
ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు 'వికారి' అనే పదాన్ని 'బికారి' అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.
సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.
కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.
నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.
భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.
కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.
మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం. రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, "యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?" అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?
ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.
కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, "ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ(ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.
ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.
అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.
అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.
తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.
'బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'
(దోహా 2)
(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు)
తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!
క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.
ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. శ్రీనివాసకృష్ణ పాటిల్

Tuesday, 12 March 2019

CRISIS MANAGEMENT SKILLS OF SUGRIVA


FAME OF SUGRIVA AS CRISIS MANAGER

Srirama’s wife was abducted by Ravana.  He was in search for her.  On the way, he had an encounter with a demon called Kabandha.  Kabandha got his curse deactivated and retained his old from as a divine person.  In return to Rama’s help, he advised Rama to approach Sugriva, who could help Rama in the crisis.
 यत्कृते व्यसनं प्राप्तं त्वया दारप्रधर्षणम्।
तदवश्यं त्वया कार्यः स सहृत्सुहृदां वर।
“Now, you are in crisis.  So, now you are supposed to make friends with an efficient person, who can bring you out of crisis.”
स च ते नावमन्तव्यः सुग्रीवो नराधिपः।
Do not overlook Sugriva, considering him to be a mere ‘monkey.’

SUGRIVA’S ASSISTANTS

निवसत्यात्मवान् वीरः चतुर्भिः सह वानरैः।
Sugriva is supported by four remarkable ministers, who are distinguished in strategies and solid in warfare.

SUGRIVA’S PERSONAL TRAITS

वानरेन्द्रो महावीर्यः तेजोवानमितप्रभः।
सत्यसन्धो विनीतश्च धृतिमान् मतिमान् महान्।।
Sugriva is a valiant person.  He is brilliant.  He is truthful.  He is deferential.  He is steady by temperament.  He is very wise.
दक्षः प्रगल्भो द्युतिमान् महाबलपराक्रमः।
He is competent.  He is shrewd.  He maintains dignity.  He is sturdy and robust enough to trounce enemies.
कृतज्ञः कामरूपी।
He is grateful.  He can take the guise of any figure according to his wish. 

SUGRIVA’S CAPABILITIES

न तस्याविदितं लोके किञ्चिदस्ति हि राघव।
There is nothing unknown to him, in the world.
नरमांसाशिनां लोके नैपुण्यादधिगच्छति।
He can overpower the demons with his skills.

HOW COULD SUGRIVA HELP RAMA

स नदीर्वुपलान् शैलान् गिरिदुर्गाणि कन्दरान्।
अन्वीक्ष्य वानरैः सार्थं पत्नीं तेधिगमिष्यति।।
He can make his monkeys search for Sita along the rivers, vast stretches of the mountains, strenuous hills, caves and get her back for Rama.
वानरांश्च महाकायान् प्रेषयिष्यति राघव।
He can send gigantic monkeys in search of Sita.
स मेरुशृङ्गाग्रगतामनिन्दितां 
प्रविश्य पातालतलेपि वा श्रिताम्।
प्लवङ्गमानां प्रवरस्तव प्रियां 
निहत्य रक्षांसि पुनः प्रदास्यति।
Wherever may Sita be present; He can fly to the top of the Meru Mountain.  He can pierce into Patala.  He can kill any number of demons.  He can get back Sita for Rama.

SUGRIVA DURING THE CRISIS OF ENMITY AGAINST VALI

Sugriva tried his best to convince Vali that he was not an enemy of the latter.  Yet, Vali was adamant and hence,
1 Sugriva found a safe place, where there would be no fear of Vali.  (Rshyamuka Mountain) 
2  He was always vigilant. 
3 He impressed his ministers with his modesty and tenderness, so that, they could not desert Sugriva even when he was deprived of his kingdom.  They were very loyal to him as well. 
4 He patiently waited for some help with which, he could get rid of Vali.  Later, with the help of Rama he successfully came out of the crisis.

PATIENCE PAYS, NOT HURRY

Sugriva was desperate to get rid of Vali.  Rama said that he could kill Vali.  Yet, Sugriva did not encourage him to do so in hurry.  He tested Rama’s strength.  When he trusted Rama that he could easily slay Vali, then only, he could design the next plan.  His strategy was proved to be right.

SUGRIVA’S PHILOSOPHY ON CRISIS

(These are the very words of Sugriva toRama.)
व्यसने वार्थकृच्छ्रे वा भये वा जीवितान्तके।
विमृशन् वै स्वया बुद्ध्या धृतिमान् नावसीदति।।
During any crisis, may it be a financial crisis, while enduring some fear, may it be perilous enough to end one’s life, but, one must be steady and cogitate upon the situation by using one’s acumen. 

बालिशस्तु नरो नित्यं वैक्लब्यं योनुवर्तते।
स मज्जत्यवशः शोके भाराक्रान्तेन नौर्जले।।
A man who is destitute is heartbroken.  When he loses control by grief, he declines down like a ship with over burden that drowns in the sea.

ये शोकमनुवर्तन्ते न तेषां विद्यते सुखम्।
तेजश्च क्षीयते तेषां न त्वं शोचितुमर्हसि।।
Those, who are grief-stricken, have no comfort.  They lose their splendour.  So, never let the grief strike you down.

स शोकं त्यज राजेन्द्र धैर्यमाश्रय केवलम्।
So, shun your grief away, harbour yourself in Courage alone.

मर्यादां सत्त्वयुक्तानां धृतिं नोत्स्रष्टुमर्हसि।
You are not supposed to shed out the decency of a competent man.

पौरुषं श्रय शोकस्य नान्तरं दातुमर्हसि।
One should go after an endeavour.  You are not supposed to give any space to grief.

Monday, 31 December 2018

Leadership Role Models - Ramayana


Leadership has been described as “a process of social influence in which one person can enlist the aid and support of others in the accomplishment of a common task"
Leadership is "organizing a group of people to achieve a common goal". The leader may or may not have any formal authority.
Studies of leadership have produced theories involving traits, situational interaction, function, behavior, power, vision and values, charisma, and intelligence, among others. Somebody whom people follow or somebody who guides or directs others is called the Leader.
A leader is -
1.      A person who rules, guides, or inspires others (Head)
2.      The person who is leading in a race.
3.      The best or the most successful person of his kind.

The following are few Leadership role Models in the Ramayana:

SRIRAMA

            SriRamahad a firm mind to follow Dharma right from his childhood.  The following qualities of his made him an exceptional leader:

1.      Character:
Character of the leader always inspires his followers.  SriRamastands first in the list of the high-ranked persons on the basis of Character.  He knew very well that he hailed from a great family and he never let himself turn inferior to the standards set by his ancestors in ruling the kingdom or honouring the eligible.  In fact, he set some new standards and was praised even by his enemies as रामो विग्रहवान् धर्मः।
2.      Humble acceptance of the instructions of the honourable and wise:
Recognizing the well-wishers and following their right advice is a good quality of the leaders.  SriRamaalways used to receive the advice of the wise positively.On the advice of his father, he followed Visvamitra without any fear.  On the advice of Visvamitra, he killed Tataka by terminating his hesitation to kill a woman.   Following the advice of Kabandha, he made friends with Sugriva and gained life-long benefits.  He had a high regard for Hanuman on whose advice he gave shelter to Vibhishana.

3.      Self-discipline:
A leader who lacks Self-discipline cannot instill discipline to his subordinates.  SriRamawas always self-disciplined.He set his way out of Ayodhyawhen he was demanded by Kaikeyi.  He was so modest when he accepted only fruits for him and grass for his horses from Guha in Srngiberapura.  He had no tendency of developing any kind of loathing against Kaikeyi, who caused his exile.  He even asked Bharata not to ill-treat her and honour her as usully.  Such qualities of his made his brothers consider him the embodiment of Dharma.

4.      Rescuing the team members:
A leader who always expects his subordinates to serve his cause but fails to rescue them is soon deserted.  Howerver,SriRamawas always kind enough.  He killed Tataka to save the people of Malada and Karusha kingdoms.  He saved the sacrifice of Visvamitra by removing the problem of Subahu and Maricha.  He helped Sugriva in gaining back his Kingdom by eliminating the threat of Vali.  He did not hurl his arrow at Vali when he could not identify Sugriva separately from Vali.  He had a doubt that he could kill his own friend Sugriva by mistake.  He did not even mind to receive the rebuke from Sugriva for doing so.  Later, he killed Vali and made Sugriva king of Kishkindha.  
  
5.      Care:
Leader must be kind and careful though not always as recommended by the experts.  In fact, those qualities were integrally present in SriRama.  SriRama encouraged Sugriva to invite Vali to fight.  He promised Sugriva that he would kill Vali with his arrow when Vali was engaged in fighting with Sugriva.  Yet, he did not hurl his arrow at Valias he could not identify Sugriva separately from Vali.  He had a doubt that his arrow could kill his own friend Sugriva by mistake.  As a result, Sugriva was severely beaten by Vali and somehow, survived.  SriRamadid not mind to receive the rebuke from Sugriva who was unaware of the mind of SriRama.Later, SriRama planned to identify Sugriva discretely from Vali. Then, he killed Valiwithout any doubt and made Sugriva king of Kishkindha. 

6.      Generosity:
A Cruel leader is his own enemy and a generous leader is acknowledged even by his opponents.  The monkeys in the army of Rama caught the spy of Ravana.  Even Vibhishana caught Suka and Sarana, the secret spies of Ravana.  However, SriRama was generous and did not wish to punish them.  He instructed Vibhishana to allow them to find everything they wanted and let them go and report to their master.Rama was angry with Ravana but not with anyone of his poor servants.

7.      Patience:
Patience is a tree with bitter seed that always bears sweet fruit.  SriRama killed Vali and made Sugriva the King of Kishkindha.  Then, the rainy season began.  He knew that it was not the right time to start search for Sita.  So, he waited patiently for two long months.  Sugriva was grateful and he sent his troops in search of Sita immediately after the rainy season.  SriRama wanted to know the way of crossing the sea to reach Lanka.  He performed tapas for three days and later, he understood the way building a bridge across the sea.  These are only few examples of his patience.

These and many such other qualities make SriRama a leadership role model.Valmiki described 16 good qualities of SriRama in the very beginning of his composition of Ramayana.


HANUMAN

            Hanuman was physically very robust and a scholar of high standards as well.  He excelled everybody in the skills of achieving the given assignment.He was a faithful servant of his master and mastered the art of being sensible.Yet, he was very humble.  The following qualities of Hanuman make him an adorable leader:

1.      Faith and Confidence:
Faith and Confidence in Self is the foremost quality of a leader.  Hanuman was always the choice of Sugriva for getting any work done.  Even Jambavan knew that none other than Hanuman would achieve the all that is necessary for SriRama.  Hanuman had these qualities filled in him.  Once, before leaping the sea to reach Lanka, he declared his strength like this – “I can beat Vainateya and the Sun in speed.  I can make the sea dry.  I can tear the earth to slices.  My mind obeys my decision.  I can pull out Amrta even from the hands of Vasava, who always bears Vajra-weapon.  So, I will definitely find Sita and make you all happy”.

2.      Determination and Effort:
A leader without an objective directs his team to devastation.  However, Hanuman had a firm determination not to return to SriRama without finding Sita.So, on his way, he had no time to receiveMainaka’s hospitality.  He overpowered all the hindrances such as Simhika and Sarama with his might and intelligence.With fearless mind, he intruded into the fort and palaces of the enemies.  He negotiated with his confusions.  He rose above his frustrations. Finally, his“never give-up” attitude made him the achiever of the toughest success!

3.      Compassion:
In the modern management, the quality of “compassion” may sound strange but, it is worth-possessing and fetching as well.  Sugriva gave the time of one month to the troop of Angada to find Sita and come back.  Hanuman, one of the troop members succeeded in finding Sita.  While the troop was coming back, the members of that troop noticed the Madhuvana (a garden) and wanted some refreshmentthere.  Hanuman advised Angada to allow them to enjoy themselves as they tasted success after many tense moments.  Even Sugriva did not mind that.  Sugriva was considered very generous and later, all the soldiers turned loyal to him.

4.      Fearlessness:
A leader is supposed to accept the challenges and overcome them with ease or with struggle.  Hanumanhad no fear in facing the challenges at any level.  He encountered the challenge of Angaraparna and made him fall on his knees.  After winning the hand of Draupadi in the svayamvara, he withstood the challenge of the entire cluster of the kings including the Kauravas and Karna at once.Once, to help the God of Fire,he did not put his step back to fight even against Indra, the king of Gods.His pluckiness knew no bounds when he alone slaughtered Paulomas, Kalikeyas and Nivatakavachas to help Gods.  His indisputable boldness was demonstrated when he alone overpowered the constellation of the Kauravas that included great warriors like Bhishma, Drona, Krpa, Asvatthama, Karna, Duryodhana and Dussasana.  His audaciousness was evidenced when he thrived in realizing his vow to take revenge on Jayadradha; who was under the protection of the entire army of the Kauravas that was being led by none other than Drona, by slaying him by the next evening.

5.      Duty-mindedness:
A Leader should be always ready to attend the problems.  Hanuman was never negligent in performing his duty.He was highly loyal and never spared any effort in achieving the desired benefit for his masters.  He never considered his status illustrious and never considered any kind of work mean or unpleasant.  He never refused any assignment given and he was never proud for he was considered as  the most competent among all by his masters.  As a King, it was his duty to protect the people and their property as well.  Even SriRama felt that he could never pay back the debt of Hanuman. 

6.      Expertise in various Arts:
A good leader must be a good learner always.  Hanuman was valiant.  His talents were multi-faceted.He was a student of the Sun and an expert in the nine-fold grammar.  His proficiency in prosody was matchless.  He was an expert musician.  He was a scholar in manySastras.  He was a great penance maker as well.

7.      Crisis Manager:
A leader must be well-acquainted to the difficult situations as a part of his duty and should be able to cleverly tackle them    Hanuman noticed some qualities of rebellion in Angada.  So, he impeded the debate and made Angada understand that his thoughts were wrong and dangerous as well.   Hanuman’s timely action was good enough for both Sugriva and Angada.  He could deliberately avoid an internal-war in the race of Vanaras..

8.      Altruistic team member:
The true leader is originated from the crust of an obedient servant.  Hanuman was never disinclined in obeying the orders of his masters.  Hanuman was mightier that anybody in the race of Vanaras.  Yet, he submissively accepted the instruction of his teacher (the Sun) to be the minister of Sugriva.   He made SriRama and Sugriva friends.  He leapt over the sea.  He found the whereabouts of Sita.  He played a major role in the war against demons.  He saved Rama and Lakshmana by bringing SanjiviniMountain.  Yet, he remained as silently as he used to be like an innocent person.

These and many such other qualities make Hanuman a leadership role model.


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...