Friday, 5 November 2021

శివోఽహమ్


 

శివోఽహమ్

శివః+అహమ్ అనే రెండు పదాల కలయిక వలన శివోఽహమ్ అనే సంధి ఏర్పడుతుంది. అంటే నేను శివుడను అని అర్థం.
చాల చిన్నపదం కదా? పలికేందుకు ఒక సెకను సమయం కూడా పట్టదు కదా? కాని, అలా పలికే అర్హత మనకు ఉన్నదా?
శివము అంటే కల్యాణము, మంగళము, (శుభము) సుఖము, మోక్షము,, శ్రేయస్సు అని అర్థాలున్నాయి. . ఇవన్నీ ఆ దేవదేవునిలో ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంకా అణిమాదులైన అష్టసిద్ధులు శేరతే - అవతిష్ఠంతే - ఇతనియందు ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంత తెలిసిన తరువాత కూడా మనం శివోఽహమ్ (నేను శివుడను) అనుకోగలమా?
}}}{{{
అత్యంతసారవంతమైన సుక్షేత్రం ఉన్నదనుకోండి - అక్కడ ఎటువంటి విత్తనం వేసినా ఏపుగా బలంగా పెరుగుతుంది.
ఎడారిలో ఖర్జూరం వంటి ఎడారి మొక్కలు మాత్రమే పెరుగుతాయి కాని, అక్కడ రసభరితమైన మంచి మామిడి తోట వేద్దామనుకుంటే అది వృథాప్రయాస కదా. అది ఎడారిభూముల లక్షణం. అందుకు మనం ఎడారిని నిందించడం వలన ప్రయోజనం లేదు.
అలాగే సుక్షేత్రాలలో విషవృక్షపు విత్తనం నాటినా అది బలంగా ఎదుగుతుంది. ఆ విషవృక్షాల పుష్పాలు అతిరమణీయమైన రంగులతో కన్నులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి ఫలాలు సుమధురసౌరభాలను వెదజల్లుతూ సమస్తప్రాణులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రంగులకు సౌరభాలకు ఆశపడి తమ చెెంతకు వచ్చే ప్రతి మనిషినీ, జంతువును. పక్షినీ, కీటకాన్నీ అవి తమ విషంతో నిర్దాక్షిణ్యంగా చంపేసి తాము మరింత బలంగా ఎదిగేందుకు ఎరువుగా మార్చుకుంటాయి.
అయితే తత్కారణంగా మనం ఆ క్షేత్రాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందువల్లనంటే అక్కడ అమృతఫలబీజం నాటినా నిస్సందేహంగా చక్కగా పెరుగుతుంది.
కాబట్టి, సుక్షేత్రనింద చేయరాదు.
సృష్టి ఆవిధంగా జరిగింది మరి.
)))(((
మరి మనం చేయవలసిన పనులు ఏమిటి?
1 విషవృక్షాలను ఖండిస్తూ, విషవృక్షబీజాలను నశింపజేయడం.
2 అమృతబీజాలను నాటుతూ, సంరక్షించుకుంటూ ఉండటం.
3 పై రెండు పనులనూ సమన్వయం చేయడం.
మనలో కొందరకు విషవృక్షాలను ఖండించడంలో నేర్పు ఉండవచ్చు కాని, అమృతబీజాలను నాటడం చేతకాకపోవచ్చును.
అలాగే కొందరకు అమృతబీజావాపనంలో చక్కని నైపుణ్యం ఉండవచ్చును కాని చేత గొడ్డలి ధరించి విషవృక్షాలను ఖండించేంత బలం లేకపోవచ్చును.
అలాగే కొందరు రెండుపనులలోనూ సమర్థులై ఉండవచ్చును.
ఈ రెండుపనులలోనూ నేర్పరులైన వారి నడుమ చక్కని సమన్వయం అవసరం. లేకుంటే ఎంత ఖండించినా విషవృక్షాలు మరలా తలెత్తవచ్చు. అందువల్ల ఖండించిన వెంటనే అక్కడ అమృతబీజాలను తప్పక నాటేయాలి. అందువల్ల సమన్వయం చేయడంలో నేర్పరులైన వారు ఎంతైనా అవసరం. అప్పుడే సుక్షేత్రాలన్నిటా సమస్తప్రాణిసుఖకరములూ సమస్తజీవానందదాయకములూ అయిన అమృతఫలవృక్షాలు విస్తరిస్తాయి.
అదీ జరగవలసిన పని.
)))(((
భారతీయులు శివోఽహమ్ అనుకోవచ్చు. ఎందుకంటే శివునిలో ఉండే ఒక లక్షణం మనలో కూడా ఉన్నది. ఈ పరమశివుడు మంచి చెడ్డ అనే భేేదం లేకుండా అందరినీ ఆదరించేస్తాడు. దేవతలైనా అదే ప్రేమ, రాక్షసులైనా అంతే ప్రేమ ఆయనకు.
చెప్పేదేమి, మన భారతీయులు కూడా ఇలాంటివారే. అచ్చం శివుడిలాంటివారే. చెడ్డవారు మన దరి చేరి స్నేహం చేస్తే వారిని కూడా ఆత్మీయులుగా భావించేస్తాం. అప్పుడు మంచివారిని కూడా మన శత్రువులుగా భావించి వారిమీద పగను పెంచుకుంటాం. అలాగే ముందుగా మంచివారే మన చెంత చేరితే మంచిని గూర్చి మంచి అవగాహను పెంచుకుంటాం. చెడును దరిజేరనియ్యం.
ఇటువంటి లక్షణం మన బలహీనత, బలం కూడా. సృష్టి అలా జరిగింది. ఎవరినీ నిందించవలసిన పని లేదు. జరగవలసింది కృషి.
)))(((
అయితే శివుడిలో మరో లక్షణం కూడా ఉన్నది.
విషం వల్ల లోకాలకు ఆపద కలగనివ్వకుండా ఆయన దానిని మ్రింగివేసి తన కంఠంలో దాచుకుని శ్రీకంఠుడయ్యాడు. గరళకంఠుడన్నా విషకంఠుడన్నా అవి నిందావాచకపదాలనిపిస్తాయి కాని ఆయన నిజానికి శ్రీకంఠుడు. ఎందుకంటే విషం కూడా ఆయన కంఠానికి ఒక ఆభరణంలా మారి మంచి శోభను కలిగించింది కాబట్టి!
ఆవిధంగా ఆయన విషాన్ని లోపలనే అణచివేసి అగాధసాగారాంతరాళంలో దాగివున్న అమృతం పైకి వచ్చేందుకు అనుమతించాడు.
ఈ రెండు పనులనే కదా, మనం ఈ సందర్భంలో
1 విషవృక్షఖండనం అని,
2 అమృతబీజావాపనం అని
అంటున్నాము.
ఈ రెండు పనులనూ విజయవంతంగా చేయగలిగితే మనకు శివోఽహమ్ అనుకునే అర్హత లభిస్తుంది.
ఆ అర్హతకోసం ఆయా రంగాలలో ఆయా పనులలో నైపుణ్యం ఉన్నవారు పరస్పరసమన్వయంతో పని చేయవలసిన ఆవశ్యకత ప్రస్తుతం మన భారతదేశంలో చాల బలంగా, ఉన్నది.
సర్వేఽత్ర సుఖినః సంతు
సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్।।
అంటూ సమస్తవిశ్వశాంతిని కోరుకునే సనాతనధర్మమే అమృతబీజం. విషవృక్షాలను నేర్పుగా ఖండించి అమృతబీజాలను నాటడమే భారతీయులందరి కర్తవ్యం.
అందుకు శివుడే మనకు ఆదర్శం కాబట్టి, శివోఽహమ్।।
।।కార్తికశుక్లప్రతిపత్, ప్లవః।।

Thursday, 2 September 2021

విజృంభిస్తున్న చార్వాకులు!


 చర్వణం అంటే నమలడం. అంటే తినడం. కడుపునింపుకొనడం (అనుభవించడం) మాత్రమే జీవితలక్ష్యమని, మిగిలినవన్నీ మనిషికి అనవసరమనీ భావించేవారు చార్వాకులు.
చారు వాక్ అనే రెండు పదాలనుండి చార్వాక అనే పదం వచ్చిందని కొందరు పండితులు అంటారు. చారు అంటే అందమైనది లేదా మనసును ఆకర్షించేది అని అర్థం. వాక్కు అంటే మాట అని అర్థం.
చార్వాకుల మాటలు, వారి బోధనలు పామరుల మనస్సులను ఇట్టే ఆకర్షించేవట. ఎందుకు ఆకర్షించవు? ఇప్పట్లో మన రాజకీయనాయకులు చేసే వాగ్దానాలు కూడా ఆనాటి చార్వాకుల మాటల మాదిరిగానే ఉండ్ల్యా?
వారి జీవితవిధానానికి ఈ క్రింది ఉదాహరణ ఒక మచ్చు మాత్రమే.
ఋణం కృత్వా ఘృతం పిబేత్!
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః?
అప్పు చేసి నెయ్యి త్రాగాలి.
(అప్పు చేసి పప్పుకూడు అని తెలుగులో)
శరీరం కాలిపోయాక మళ్లీ వచ్చేదెలా?
అంటే మనం కష్టపడి సంపాదించి అనుభవించాలి అనే కాన్సెప్టును వీరు అంగీకరించరు. పుట్టడమనేది వీరికి సంబంధించి ఒక ఆకస్మికపరిణామం. ఒక ఆక్సిడెంట్. అంతే. పుట్టిన తరువాత జీవితాన్ని అనుభవించి వదిలేయాలి అంటారు. కాని సంపాదన ఉంటే కాని జీవితాన్ని ఆనందించడం సాధ్యం కాదు. సంపాదన కోసం శ్రమిస్తే అందువల్ల ఆనందం ఏముంది, కష్టం తప్ప? అని వీరి అభిప్రాయం. అందువల్ల కష్టపడకుండా, అప్పులు చేయాలి, అనుభవించాలి అంటారు.
కాని, ఆనాడైనా ఈనాడైనా భారతీయులందరికీ అప్పు అంటే చచ్చేంత భయం. అప్పు చేయడం ఎంత సులువో తిరిగి ఆ అప్పును తీర్చడం అంత కష్టం కదా. అప్పును తీసుకున్న తరువాత ఎలాగైనా తీర్చివేయవలసిందే. ఋణం తీర్చుకొనడం అనేది భారతీయులకు ఒక పవిత్రమైన భావన. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా తాను ఋణపడ్డానని, వారిని సంతోషపెట్టడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలని భావిస్తారు. అటువంటిది ఎవరో పరాయి వ్యక్తుల దగ్గరనుండి ఋణం తీసుకుంటే తిరిగి ఆ ఋణం తీర్చకపోవడమనేది మహాపాపమని భావిస్తారు. ఋణం తీర్చకుండా మరణిస్తే మరుసటి జన్మలో కూడా ఆ ఋణభారం తమ నెత్తిన కొండగా మారి పడుతుందని, కాబట్టి అప్పు తీసుకున్న జన్మలోనే ఆ అప్పును తిరిగి చెల్లించేయాలని తాపత్రయపడతారు. ఒక వ్యక్తి అప్పు తీర్చకుండానే మరణిస్తే, ఆ వ్యక్తి కుమారుడు తన తండ్రి చేసిన అప్పును తీర్చడం తన బాధ్యతగా భావించి తీర్చడానికే ప్రయత్నిస్తాడు.
సర్వేషామపి శౌచానామ్ అర్థశౌచం పరం స్మృతమ్ - అని పెద్దల మాట. శౌచమంటే కేవలం పళ్లు తోమడం స్నానం చేయడం మడి బట్టలు కట్టడం మాత్రమే కాదు, ఆర్థికవిషయాలలో కూడా పవిత్రంగా ఉండాలి. నిజానికి అదే అన్నిటిలోనూ నిజమైన, అతి గొప్పదైన శౌచం (పవిత్రత) అని నైతికశాసనం కూడా చేశారు.
అలాంటి భారతీయసామాజికభావన మీద చార్వాకులు తిరుగుబాటు చేశారు. అప్పు చేసి చచ్చేేంతవరకూ అనుభవించడమే జీవితపరమార్థమని, తిరిగి అప్పు తీర్చే బాధ్యతను నెత్తిమీద పెట్టుకోవద్దని, పునర్జన్మ అనేది, పునర్జన్మలో మరలా ఋణభారం అనేది వట్టి పనికిమాలిన అబద్ధపు మాటలని ప్రచారం చేశారు.
అదిగో - సరిగ్గా అక్కడే - పునర్జన్మ అనేది బూటకం అని, బాధ్యతారాహిత్యమే జీవితసారాంశమని చార్వాకులు అన్నారు కదా. అక్కడే పామరజనాలకు చార్వాకులు పిచ్చిపిచ్చిగా నచ్చేశారు. వేలం వెర్రిగా వారి బోధనలను అనుసరించారు.
సామాజికజీవనం వారి బాధ్యతారాహిత్యంతో అస్తవ్యస్తమైంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు బాధ్యత లేదు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత లేదు. భార్యాభర్తల నడుమ అనుబంధం పరస్పరబాధ్యత అనే ప్రశ్న లేదు. యజమానినుండి జీతం తీసుకొనడమే తప్ప ఆ యజమాని చెప్పిన పనులు చేయవలసిన బాధ్యత తనకు లేదని ఉద్యోగులు భావించారు. వ్యవసాయం చేయవలసిన బాధ్యత లేదని, ఎవడో పండించిన పంటను ఎత్తుకుపోయి అనుభవించడంలో తప్పు లేదనే భావాలు ప్రబలిపోయాయి. అనేక తరాలుగా మలచబడ్డ ఒక సామాజికవ్యవస్థ వీరి ఆగడాలవలన ఛిన్నాభిన్నమైపోయింది.
స్వర్గమూ లేదు, నరకమూ, లేదు, పునర్జన్మ లేదు, సృష్టించే దేవుడూ లేడు, దండించే యముడూ లేడు, అసలు శరీరం కంటె వేరుగా ఆత్మ అనేది లేనే లేదు. కాబట్టి దేనికీ మనం భయపడవలసిన అవసరం లేదు, Boys, Let us just Enjoy ourselves అనే మూకలు తయారైనాయి. అదిగో - ఆ సమయంలోనే ఆ చార్వాకులకు ఆ చార్వాకుల అనుయాయులకు నాస్తికులు అని పేరు వచ్చింది.
అస్తి అంటే ఉన్నది అని అర్థం. ఆత్మ అనేది ఉన్నది, పునర్జన్మ ఉన్నది అనేవారు ఆస్తికులు.
నాస్తి (న + అస్తి) అంటే లేదు అని అర్థం. ఆత్మ అనేది లేదు, పునర్జన్మ అనేది లేదు అనేవారు నాస్తికులు.
వేదాలు ఆత్మ ఉన్నదని, కర్మానుసారం పునర్జన్మ ఉంటుందని చెబుతాయి కాబట్టి, పాణిని నాస్తికుడు అంటే వేదనిందకుడు (వేదాలను తిరస్కరించేవాడు నాస్తికుడు) అని నిర్వచనం చేశాడు.
కాని, క్రమంగా చాలమంది ఈ చార్వాకుల నాస్తికభావాల వలన సమాజానికి కలిగే నష్టమేమిటో స్వీయానుభవాల వలన తెలుసుకున్నారు. బాధ్యతారాహిత్యం వలన దుఃఖమే తప్ప సుఖం అనేది ఎండమావిలో నీటివంటిది అని గ్రహించారు. తాము మారారు. మారని వారిని దూరంగా ఉంచారు. (అది వెలివేయడం అనండి, బహిష్కరణ అనండి.) నాస్తికులు నిందాపాత్రులైనారు. అప్పటినుండే నాస్తిక అనే పదం వెక్కిరింతకు గురైంది. నాస్తికులను వారి చేష్టలను, వారి బాధ్యతారాహిత్యాన్ని అసహ్యించుకొనడం అప్పటినుండే ప్రారంభమైంది.
(అసహ్యించుకొనడం అనే పదానికి hate అనే ఇంగ్లీషు పదాన్ని ఉపయోగించి అనువాదం చేస్తుంటారు. కాని అసహ్యము అంటే ద్వేషించడం కాదు. సహింపరానిది అని అర్ధం. ఎండాకాలంలో ఎండ కూడా మనకు అసహ్యమే. అంటే మనం సహించలేనిదే. అంటే మనం ఎండ ధాటికి తాళలేమని, ఎండకు తట్టుకోలేమని అర్థం. అంతే కాని ఎండను ద్వేషిస్తున్నామని అర్థం కాదు. సంస్కృతాన్ని నిష్కారణంగా ద్వేషించే కొందరు మిడిమిడి జ్ఞానపు తెలుగు పండితులు (!!!) అసహ్యమంటే ద్వేషించడమే అని భావిస్తూ, తాము పెంచుకున్న భావదారిద్ర్యాన్నంతా తమ జీవితచరిత్రల రూపంలో కూడా వెలిగ్రక్కుతూ ఉంటారు.)

సరే, మొత్తానికి అప్పట్లోనే ప్రజలు వారి ప్రభావంనుండి బయటపడడానికి, సభ్యసమాజంగా మరలా రూపు దిద్దుకొనడానికి చాల కాలం పట్టింది. అలా చార్వాకులు లేదా నాస్తికులు ఒకప్పుడు భారతీయసమాజంలో ఒక వెలుగు వెలిగారు. (తమ స్వార్థం కోసం సమాజాన్ని ఆటవికసమాజంగా మార్చేశారు.)
ఇదిగో, మరలా ఈ రోజుల్లో ఆ చార్వాకులు లేదా నాస్తికులు మరలా విజృంభించేందుకు, సమాజాన్ని మరలా అల్లకల్లోలం చేసేందుకు ఈవిధంగా సంసిద్ధులౌతున్నారు.
ఇప్పటికే నాయకులనే ముసుగులో కొందరు చార్వాకులు అప్పులు చేసిన వారు మరలా కట్టనవసరం లేదని ఋణమాఫీ పేరిట జనాలను ఆకట్టుకొనడం మొదలు పెట్టారు. శ్రమించకుండా అప్పనంగా వచ్చే సొమ్మును పామరజనాలకు బాగా రుచి చూపించారు. సోమరిపోతుల సైన్యాలను సృష్టించారు. క్రొత్త క్రొత్త పన్నులను కనిపెడుతున్నారు. కష్టించి పని చేసేవారి కష్టార్జితాన్ని యథేష్టంగా దోచేస్తున్నారు. తమ సోమరిసైన్యాలకు పంచి పెట్టి పోషిస్తున్నారు.
భారతీయసమాజవ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించి నాశనం చేయడమే వారి లక్ష్యం.
ఆ నాయకకుటుంబమంతా ఇదే తమ ఏకైకలక్ష్యంగా అధికారాన్ని కూడా సంపాదించి ఇప్పటికే సగం సమాజాన్ని చెడగొట్టింది. వారి అజెండా అమలు కావాలంటే వారికి ఐదేళ్ల వ్యవధి సరిపోదు. మళ్లీ మళ్లీ అధికారానికి రావలసిన అవసరం ఉంది. అందుకే ఇరవైయేళ్ల అధికారం, ముప్పైయేళ్ల అధికారం అంటూ కలవరిస్తుంటాడా నాయకుడు. వారికి మనం ఆ అవకాశం ఎంతమాత్రం ఇవ్వరాదు.
వారి నుండి ఉచితంగా అందుతున్న తాయిలాలకు ఆశపడి, వారి ఆశయాలకు అనుగుణంగా ఇదుగో ఈ ప్రొఫెట్ జీయం మోజెస్ లాంటివారు బహిరంగంగానే అప్పులను రద్దు చేయించేస్తానంటూ ఆరాధనలంటూ వెర్రి మొర్రి ఆరాధనలు కూడా మొదలు పెట్టారు.
వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు
చీడపురుగు చేరి చెట్టు చెరచు.
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ
అని వేమన చెప్పిన మాటలు మనం స్మరించుకుని, ఇలాంటి నాస్తికుల గోముఖవ్యాఘ్రపు బోధనలనుండి మనవారు అనుకున్నవారిని జాగ్రత్తగా కాపాడుకుందాం.

Tuesday, 17 August 2021

జాగ్రత జాగ్రత - మేలుకొనండి - మేలుకొనండి

దేవనాగరి

माता नास्ति पिता नास्ति बन्धुः सहोदरः ।

अर्थं नास्ति गृहं नास्ति तस्मात् जाग्रत जाग्रत ॥1॥


जन्म दुःखं जरा दुःखं जाया दुःखं पुनः पुनः ।

संसारसागरं दुःखं तस्मात् जाग्रत जाग्रत ॥2॥


कामः क्रोधश्च लोभश्च देहे तिष्ठन्ति तस्कराः ।

ज्ञानरत्नापहाराय तस्मात् जाग्रत जाग्रत ॥3॥


आशया बध्यते लोकः कर्मणा बहुचिन्तया ।

आयुक्षीणं न जानाति तस्मात् जाग्रत जाग्रत ॥4॥


सम्पदः स्वप्नसङ्काशाः यौवनं कुसुमोपमम् ।

विद्युच्चञ्चलमायुष्यं तस्मात् जाग्रत जाग्रत ॥5॥


क्षणं वित्तं क्षणं चित्तं क्षणं जीवितमेव च ।

यमस्य करुणा नास्ति तस्मात् जाग्रत जाग्रत ॥6॥


अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः ।

नित्यं सन्निहितो मृत्युः तस्मात् जाग्रत जाग्रत॥7॥


తెలుగు

మాతా నాస్తి పితా నాస్తి బన్ధుః సహోదరః ।

అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥1॥


జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః ।

సంసారసాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత ॥2॥


కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః ।

జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత ॥3॥


ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచిన్తయా ।

ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥4॥


సమ్పదః స్వప్నసఙ్కాశాః యౌవనం కుసుమోపమమ్ ।

విద్యుచ్చఞ్చలమాయుష్యం తస్మాత్ జాగ్రత జాగ్రత ॥5॥


క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమేవ చ ।

యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥6॥


అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః ।

నిత్యం సన్నిహితో మృత్యుః తస్మాత్ జాగ్రత జాగ్రత॥7॥


కన్నడం

ಮಾತಾ ನಾಸ್ತಿ ಪಿತಾ ನಾಸ್ತಿ ಬನ್ಧುಃ ಸಹೋದರಃ ।

ಅರ್ಥಂ ನಾಸ್ತಿ ಗೃಹಂ ನಾಸ್ತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥1॥


ಜನ್ಮ ದುಃಖಂ ಜರಾ ದುಃಖಂ ಜಾಯಾ ದುಃಖಂ ಪುನಃ ಪುನಃ ।

ಸಂಸಾರಸಾಗರಂ ದುಃಖಂ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥2॥


ಕಾಮಃ ಕ್ರೋಧಶ್ಚ ಲೋಭಶ್ಚ ದೇಹೇ ತಿಷ್ಠನ್ತಿ ತಸ್ಕರಾಃ ।

ಜ್ಞಾನರತ್ನಾಪಹಾರಾಯ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥3॥


ಆಶಯಾ ಬಧ್ಯತೇ ಲೋಕಃ ಕರ್ಮಣಾ ಬಹುಚಿನ್ತಯಾ ।

ಆಯುಕ್ಷೀಣಂ ನ ಜಾನಾತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥4॥


ಸಮ್ಪದಃ ಸ್ವಪ್ನಸಙ್ಕಾಶಾಃ ಯೌವನಂ ಕುಸುಮೋಪಮಮ್ ।

ವಿದ್ಯುಚ್ಚಞ್ಚಲಮಾಯುಷ್ಯಂ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥5॥


ಕ್ಷಣಂ ವಿತ್ತಂ ಕ್ಷಣಂ ಚಿತ್ತಂ ಕ್ಷಣಂ ಜೀವಿತಮೇವ ಚ ।

ಯಮಸ್ಯ ಕರುಣಾ ನಾಸ್ತಿ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ॥6॥


ಅನಿತ್ಯಾನಿ ಶರೀರಾಣಿ ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತಃ ।

ನಿತ್ಯಂ ಸನ್ನಿಹಿತೋ ಮೃತ್ಯುಃ ತಸ್ಮಾತ್ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ॥7॥


తమిళం

மாதா நாஸ்தி பிதா நாஸ்தி பந்துஃ ஸஹோதரஃ ।

அர்தஂ நாஸ்தி க௃ஹஂ நாஸ்தி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥1॥


ஜந்ம துஃகஂ ஜரா துஃகஂ ஜாயா துஃகஂ புநஃ புநஃ ।

ஸஂஸாரஸாகரஂ துஃகஂ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥2॥


காமஃ க்ரோதஶ்ச லோபஶ்ச தேஹே திஷ்டந்தி தஸ்கராஃ ।

ஜ்ஞாநரத்நாபஹாராய தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥3॥


ஆஶயா பத்யதே லோகஃ கர்மணா பஹுசிந்தயா ।

ஆயுக்ஷீணஂ ந ஜாநாதி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥4॥


ஸம்பதஃ ஸ்வப்நஸங்காஶாஃ யௌவநஂ குஸுமோபமம் ।

வித்யுச்சஞ்சலமாயுஷ்யஂ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥5॥


க்ஷணஂ வித்தஂ க்ஷணஂ சித்தஂ க்ஷணஂ ஜீவிதமேவ ச ।

யமஸ்ய கருணா நாஸ்தி தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத ॥6॥


அநித்யாநி ஶரீராணி விபவோ நைவ ஶாஶ்வதஃ ।

நித்யஂ ஸந்நிஹிதோ ம௃த்யுஃ தஸ்மாத் ஜாக்ரத ஜாக்ரத॥7॥


మళయాళం

മാതാ നാസ്തി പിതാ നാസ്തി ബന്ധുഃ സഹോദരഃ ।

അര്ഥം നാസ്തി ഗൃഹം നാസ്തി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥1॥


ജന്മ ദുഃഖം ജരാ ദുഃഖം ജായാ ദുഃഖം പുനഃ പുനഃ ।

സംസാരസാഗരം ദുഃഖം തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥2॥


കാമഃ ക്രോധശ്ച ലോഭശ്ച ദേഹേ തിഷ്ഠന്തി തസ്കരാഃ ।

ജ്ഞാനരത്നാപഹാരായ തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥3॥


ആശയാ ബധ്യതേ ലോകഃ കര്മണാ ബഹുചിന്തയാ ।

ആയുക്ഷീണം ന ജാനാതി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥4॥


സമ്പദഃ സ്വപ്നസങ്കാശാഃ യൌവനം കുസുമോപമമ് ।

വിദ്യുച്ചഞ്ചലമായുഷ്യം തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥5॥


ക്ഷണം വിത്തം ക്ഷണം ചിത്തം ക്ഷണം ജീവിതമേവ ച ।

യമസ്യ കരുണാ നാസ്തി തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത ॥6॥


അനിത്യാനി ശരീരാണി വിഭവോ നൈവ ശാശ്വതഃ ।

നിത്യം സന്നിഹിതോ മൃത്യുഃ തസ്മാത് ജാഗ്രത ജാഗ്രത॥7॥

Saturday, 14 August 2021

యుద్ధం ఎందుకు చేయాలి?




ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి. ప్రతి రాజ్యానికి అధిపతిగా ఒక రాజు ఉండేవాడు. సాధారణంగా రాజ్యాలమధ్య సఖ్యత ఉండేది. అయితే అప్పుడప్పుడు ఆయా రాజుల నడుమ కలహాలు సంభవించేవి. అందుకు ఎన్నో కారణాలు.

రాజ్యస్త్రీస్థానదేశానాం జ్ఞానస్య చ బలస్య చ।
అపహారో మదో మానః పీడా వైషయికీ తథా।।

జ్ఞానార్థశక్తిధర్మాణాం విఘాతో దైవమేవ చ।
మిత్రార్థం చావమానశ్చ తథా బంధువినాశనమ్।।

అంటూ కౌటిల్యశిష్యుడైన కామందకుడు యుద్ధాలకు కారణాలను పేర్కొన్నాడు.

1) రాజ్యరక్షార్థమ్ -
(అంటే అధికారరక్షణం కోసం యుద్ధం)

2) స్త్రీరక్షార్థమ్ -
(సీతమ్మ కోసం రావణాసురుడితో రాముడు చేసిన యుద్ధం - స్వయంవరంలో ద్రౌపది క్షత్రియేతరుని వరించిందనే అక్కసుతో దుర్యోధనాదులు చేసిన ఆగడం, కృష్ణుడు రుక్మిణికోసం చేసిన యుద్ధం - ఆధునిక చరిత్రలో చితోర్ రాణి పద్మిని ఆత్మగౌరవం కాపాడడం కోసం జరిగిన యుద్ధం మొదలైనవి ఉదాహరణలు)

3) స్థానరక్షార్థమ్
(అంటే రాజధానిరక్షణకోసం యుద్ధం)

4) విషయపీడాప్రతికారః -
(దేశానికి చెందిన ప్రజలను, శత్రువులు పీడిస్తుంటే వారిని రక్షించుకొనడం కోసం యుద్ధం)

5) దేశరక్షార్థమ్ -
(దేశానికి చెందిన భూభాగాన్ని రక్షించుకొనడం కోసం యుద్ధం)

6) జ్ఞానరక్షార్థమ్ -
(విద్యాలయాలపై, గురువులపై, విద్యార్థులపై దాడి జరిగినపుడు యుద్ధం - మారీచసుబాహులతో రాముని యుద్ధం)

7) బలరక్షార్థమ్ -
(సైన్యంపై దాడి జరిగినపుడు ప్రతికారం తీర్చుకోవాలి - పుల్వామా వంటి ఘటనలు జరిగినపుడు)

8) మదః -
ఆయా రాజుల పొగరు కారణంగా వైరం ఏర్పడుతుంది. ద్రుపదుడు తన పొగరు కొద్దీ ద్రోణాచార్యునితో వైరం పెంచుకున్నాడు. వారి వైరం వారి సంతానానికి కూడా అంటుకుంది. యుద్ధంలో ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు మర్యాదను అతిక్రమించి ద్రోణాచార్యులవారి శిరస్సును ఖండించాడు. ఆ ధృష్టద్యుమ్నుని ద్రోణపుత్రుడైన అశ్వత్థామ హతమార్చాడు.

9) మానః -
తనకు చాలని ఆత్మాభిమానం కారణంగా వైరం ఏర్పడుతుంది. లేదా శక్తిమంతుల ఆత్మాభిమానాన్ని నిష్కారణంగా దెబ్బ కొట్టినా వైరం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు తనను పరాజితుడిని చేసి తన చెల్లెలైన రుక్మిణిని వివాహం చేసుకున్నందుకు రుక్మి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. మనస్సులో ఏవిధంగానైనా యాదవులను అవమానించాలనే కక్ష గూడు కట్టుకుంది. ఒకసారి బలరాముడితో జూదం ఆడుతూ బలరాముడు గెలిచినప్పటికీ ఓడిపోయాడని వెక్కిరించాడు. కాదు నేనే గెలిచానని బలరాముడంటే నువ్వు అబద్ధాలాడుతున్నావని ఆరోపించాడు. బలరాముడు మండిపడి ఒకే ఒక్క పిడికిలిపోటుతో రుక్మిని యమలోకానికి పంపించేశాడు. అలాగే రాజసూయయాగసభలో శ్రీకృష్ణునికి పాండవులు చేసిన అగ్రపూజను సహించలేక వాచాలత కొద్దీ అందరినీ నిందిస్తూ శ్రీకృష్ణుని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శిశుపాలుడు శిరశ్ఛేదం చేయించుకున్నాడు.

10) అర్థరక్షార్థమ్ -
(దేశానికి ఆదాయాన్ని తెచ్చే వనరులపై ఆక్రమణ జరిగినపుడు వాటిని కాపాడుకొనడం కోసం యుద్ధం)

11 ) ధర్మరక్షార్థమ్ -
(ధర్మాన్ని కాపాడటం కోసం - ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అది ధర్మజీవనం. కాని, ఇతరులను నిష్కారణంగా పీడించటం, తాము చెప్పినట్టే ప్రజలందరూ నడచుకోవాలి అనటం అధర్మం. ఆవిధంగా లోకానికి భౌతికంగా కాని, మానసికంగా కాని, నైతికంగా క్షోభ కలిగించే వారిని అణచడం కోసం జరిగే యుద్ధం - ఉదాహరణ కురుక్షేత్రయుద్ధం)

12) దైవమ్ -
(అపార్థాల వలన, శకునివంటి పైశున్యకారులవలన విరోధం చెలరేగి యుద్ధం జరుగవచ్చు)

13) మిత్రార్థమ్ -
(ఆప్తమిత్రులను రక్షించడం కోసం, వారి ప్రయోజనాలను కాపాడటం కోసం యుద్ధం - సుగ్రీవుని కోసం రాముడు, రాముని కోసం సుగ్రీవుడు చేసిన యుద్ధాలు)

14) అవమానప్రతికారః -
(రాజుకుగాని, దేశానికి గాని అవమానం లేదా ఆపద కలిగినపుడు యుద్ధం చేయవచ్చు - తమ దేశంలో ట్విన్ టవర్లపై జరిగిన దాడికి ప్రతికారంగా అమెరికా ఒబామాను హతమార్చింది కదా, అటువంటి యుద్ధం)

15) బంధువినాశప్రతికారః -
(ఆత్మీయబంధువులను నాశనం చేసిన వారిపై యుద్ధం - రాత్రివేళ నిద్రిస్తున్న తమ కుమారులను హతమార్చిన అశ్వత్థామను వెంటాడి పట్టుకున్న భీమార్జునులు ఉదాహరణార్హులు)

ఈ విధంగా యుద్ధం చేయటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మన దేశానికి ఇరుగు పొరుగు అనదగిన ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధసంక్షోభం జరుగుతోంది. తాలిబన్లకు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నడుమ రాజ్యంకోసం యుద్ధం నడుస్తోంది.
ఇక్కడ రాజ్యమంటే భూభాగం కాదు. రాజ్యమంటే ఒక దేశపు భూభాగం పై అధికారం అని మాత్రమే అర్థం. ఒక దేశపు రాజ్యాంగానికి (!) విరుద్ధంగా లేదా ఆ దేశప్రజలకు అభ్యంతరకరమైన రీతిలో ఆ దేశప్రజలపై పెత్తనం చేసే అధికారాన్ని ఎవరైనా బలాత్కారపూర్వకంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తే వారితో విరోధం కలుగుతుంది. అందువల్ల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థానంలో జరుగుతున్నది అదే. తాలిబన్లు బలాత్కారపూర్వకంగా ఆఫ్ఘనిస్థాన్లో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రతిఘటిస్తోంది.

ఇది ఇలా ఉండగా, భారతప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోవాలి - అక్కడి సంక్షోభాన్ని సరిజేయాలి అని కొందరు మిత్రులు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు అది తనకు మాలిన ధర్మం - అది మనకు అనవసరమైన విషయం అంటున్నారు.

పైన పేర్కొన్నవాటిలో మనం (భారతదేశం) ఆఫ్ఘనిస్థాన్ క్షేత్రంలో
(ప్రస్తుతం) యుద్ధం చేసేందుకు తగిన కారణాలు ఒకటి రెండు ఉన్న మాట నిజమే.

1 అది మన రాజ్యం కాదు - (ఒకప్పుడు మన రాజ్యం అనే సెంటిమెంటు వద్దు). అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

2 తాలిబన్లు తాము ఆక్రమించిన ఆఫ్ఘన్ భూభాగంలోని స్త్రీలపై దుర్భరమైన అత్యాచారాలు చేస్తున్న మాట నిజమే. ధర్మానికి కట్టుబడి ఆ స్త్రీలను రక్షించవలసిన బాధ్యత మనకున్నది.

3) కాబూల్ మన రాజధాని కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

4) ఆఫ్ఘన్లో ఉన్నది మన దేశపు ప్రజలు కారు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కాని వారు శరణుకోరితే వారిని రక్షించవలసిన బాధ్యత మనకుంటుంది.

5) ఆఫ్ఘన్ ప్రస్తుతం మన భూభాగం కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

6) మన విద్యాలయాలవంటివి ఆఫ్ఘన్లో లేవు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

7) మన సైన్యంపై తాలిబన్లు దాడి జరపలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

8) తాలిబన్లు తమ పొగరుకొద్దీ మనకు అపకారం చేస్తే దండించవలసిందే. కాని వ్యవహారం అంతదూరం రాలేదు.

9) తాలిబన్ల ఆత్మాభిమానాన్ని మనం గాని, మన ఆత్మాభిమానాన్ని వారుగాని దెబ్బతీయడం జరగలేదు అందువల్ల మనకూ వారికీ ఈ విషయంలో వైరం లేదు.

10) మన ఆదాయవనరులకు తాలిబన్లవల్ల నష్టం కలుగలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

11) ధర్మమంటే కొందరు మతం అని భావిస్తుంటారు. అలాగైతే ఆఫ్ఘన్లో తాలిబన్లవలన చిత్రహింసలకు గురి అవుతున్నది ఇస్లాం మతస్థులే. కాని, భారతదేశంలోని ఇస్లాం మతస్థులు ఆ విషయమై తమ కలవరాన్ని వ్యక్తపరచటం లేదు. అందువలన మనం తగుదునమ్మా అని యుద్ధానికి పోవడం సమంజసం కాదు. అలా కాదు, ధర్మమంటే మతాతీతమైన మానవనీతి అని భావించినపక్షంలో మనకు ఆ ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఉన్నది.

12) దైవమ్ అనేది మన చేతిలో లేని విషయం. దైవికంగా యుద్ధం సంభవిస్తే పోరాటం చేయవలసిందే.

13) ప్రస్తుతకాలపు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మనకు మిత్రుడే. కాబట్టి వారిని రక్షించవలసిన బాధ్యత మనపై ఉంది.

14) తాలిబన్లు భారతదేశాన్ని తమ చేష్టలతో అవమానిస్తే చేష్టలతోనే ప్రతికారం చేయాలి. తమ మాటలతో అవమానిస్తే మాటలతోనే ప్రతికారం చేయాలి.

15) తాలిబన్లు ఆఫ్ఘన్లో పని చేస్తున్న భారతపౌరులను హతమార్చడం వంటి పనులను చేస్తే ప్రతికారంగా యుద్ధం చేయవచ్చు.

ఈ విధంగా మనం తాలిబన్లతో యుద్ధం చేయడానికి తగిన కారణాలు కొన్ని ఉన్నాయి. కాని, చాల కారణాల వలన మనం వారితో యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

"ప్రయోజనమనుద్దిశ్య న మందోఽపి ప్రవర్తతే" అని అందరూ అంగీకరించే మాట.

ఏదో ఒక ప్రయోజనం లేదా ఏదో ఒక లాభం లేకపోతే ఒక మూర్ఖుడు గాని చివరకు ఒక సోమరిపోతు గాని ఏ పనీ చేయడు.

మరి ఇక తెలివైనవారి సంగతి వేరే చెప్పాలా? ఎన్నెన్నో బాధ్యతలు కలిగినవారు నిష్కారణంగా యుద్ధం వంటి అతి పెద్ద సమస్యలను చేతులారా నెత్తికెత్తుకుంటారా?

"భూమిర్మిత్రం హిరణ్యం చ విగ్రహస్య ఫలం త్రయమ్"

యుద్ధం వలన మూడు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అంటూ కామందకుడు వాటిని పేర్కొన్నాడు.

1) శత్రుభూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం
2) వేరొకదేశంతో మన మైత్రీసంబంధాన్ని దృఢం చేసుకొనడం
3) ధనలాభం

ఈ మూడింటిలో ఏ ఒక్కదానినీ ఆశించకుండా యుద్ధం చేయడం వృథా అని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం.

పైగా యుద్ధం అనేది ఒకరోజుతోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ముగిసేది కాదు. దాని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా దేశప్రజలందరిపైనా సుదీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి యుద్ధాన్ని మనంతట మనంగా (స్వయంగా) అనాలోచితంగా నిష్కారణంగా మొదలు పెట్టరాదు.

కాని, ఇతరులు మనపై యుద్ధాన్ని ప్రకటిస్తే మాత్రం ఆత్మరక్షణకోసం భీకరమైన యుద్ధానికి సిద్ధం కావలసిందే. ఎందుకంటే అది జీవన్మరణసమస్య.

ఇంకా, కాని ఎంతటి పరాక్రమవంతుడైనా యుద్ధాన్ని ఒంటరిగా చేయరాదు. అభిమన్యుడు అసహాయశూరుడై చేసిన అసామాన్యయుద్ధపు ఫలితం తెలిసిందే కదా? కాబట్టి, యుద్ధం చ బహుభిస్సహ అన్నారు. యుద్ధమనేది మిత్రులందరినీ కలుపుకుని చేయవలసిన పని.

అందువల్ల ఆఫ్ఘన్ ప్రజలను రక్షించాలనుకుంటే ప్రపంచంలోని ఇతరదేశాలను కలుపుకుని క్రమంగా సామభేదదానదండోపాయాలను ప్రయోగించి తాలిబన్లను వారి మిత్రులను కూడా దారికి తీసుకురావాలి. లొంగదీసుకోవాలి. ఆ రెండూ కూడా సాధ్యం కాకుంటే వారిని సమూలంగా నాశనం చేయాలి. దానికి చాల కాలం పట్టవచ్చు. కాని, ఫలితం ముఖ్యం. ఆ ఫలితమే ప్రపంచానికంతటికీ చిరసుఖకారి.

ఇతి శమ్.



భారతస్వాధీనతాదినోత్సవసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు



 



సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...